ఒమన్లో పనిచేస్తున్న ఛత్తీస్గఢ్కు చెందిన ఒక మహిళ స్వదేశానికి రావాలని అభ్యర్థించడంతో మస్కట్లోని భారత రాయబార కార్యాలయ ఆశ్రయంలో వసతి కల్పించినట్లు ప్రభుత్వ అధికారి మంగళవారం తెలిపారు. దుర్గ్ కలెక్టర్ రిచా ప్రకాష్ చౌదరి మాట్లాడుతూ, దీపికా జోగి ఫిబ్రవరి 1న తనను భారత్ కు పంపించాలని మస్కట్లో భారత రాయబార కార్యాలయాన్ని కోరారు. "ఆమె అక్కడ ఎంబసీ షెల్టర్లో వసతి పొందింది," అని తెలిపారు.
దీపికా స్పాన్సర్ మరియు మస్కట్లోని స్థానిక అధికారులను (భారత రాయబార కార్యాలయ అధికారులు) సంప్రదించి పరిష్కారం మరియు స్వదేశానికి రప్పించడం కోసం ప్రయత్నాలు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. న్యాయపరమైన సమస్యలను పరిష్కరించిన తర్వాత మహిళను స్వదేశానికి రప్పించేందుకు భారత రాయబార కార్యాలయం సహాయాన్ని అందజేస్తుందని ఆమె తెలిపారు.
దీపిక టూరిస్ట్ వీసాపై ఒమన్ వెళ్లారని, ఆ తర్వాత దానిని ఎంప్లాయిమెంట్ (వర్క్ వీసా)గా మార్చుకున్నారని కలెక్టర్ చెప్పారు. "ఆమె తన స్పాన్సర్తో 8 నెలలు పనిచేసింది. మస్కట్లోని స్పాన్సర్ మరియు స్థానిక అధికారులు (భారత రాయబార కార్యాలయ అధికారులు) స్నేహపూర్వక పరిష్కారం మరియు స్వదేశానికి వెళ్లడం కోసం ఏర్పాట్లు చేశారు," అని చౌదరి తెలిపారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి