గ్రూప్-1 మెయిన్స్కు అభ్యర్థుల ఎంపికపై టీజీపీఎస్సీ తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది. మెయిన్స్కు 1:50 నిష్పత్తిలోనే అభ్యర్థులను ఎంపిక చేస్తామని తేల్చిచెప్పింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా మెయిన్స్ పరీక్షకు 1:100 ప్రాతిపదికన ఎంపికచేయాలని ఉద్యోగార్థులు గతకొన్నిరోజులుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 1:100 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు జీఏడీ జారీ చేసిన జీఓ నం. 29, 55 మేరకు అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని బోర్డు వెల్లడించింది. ఇదిలాఉంటే.. గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ను ఫిబ్రవరి 19న టీజీపీఎస్సీ విడుదల చేసింది. 563 పోస్టులతో గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ను ప్రకటించింది. ఈ పోస్టులకు జూన్ 9వ తేదీన ప్రిలిమ్స్ నిర్వహించింది. త్వరలోనే ఈ ఫలితాలు వెలువడనున్నాయి. ఇక అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే టీజీపీఎస్సీ ప్రకటించింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కువైట్: రెసిడెన్సీ చట్టాని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు! 750 మంది ప్రవాసులు అరెస్ట్!
వాట్సాప్ కీలక ప్రకటన! 66 లక్షల ఖాతాలు బ్లాక్! కొత్త సైబర్ భద్రతా చర్యలు!
అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు! భార్య కాపురానికి రాలేదని.. దాని వల్ల నాకేం ఉపయోగం రా బాబు!
మీకు అలసటగా ఉందా చీకాకుగా కూడా ఉంటున్నారా! అయితే మీ శరీరంలో బి12 లోపించినట్టే!
న్యూయార్క్ బ్రూక్లిన్ ప్రైడ్ ఈవెంట్లో! మహిళపై మిలియనీర్ బ్యాంకర్ దాడి! పదవికి రాజీనామా!
క్వాంటాస్ ఫ్లైట్లో విషాదం! భారత సంతతికి చెందిన యువతి మృతి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: