ఈసారి ఎన్నడూ లేని దూకుడు ప్రదర్శించి ఫైనల్కు చేరుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తుది మెట్టుపై బోల్తా పడడాన్ని ఆ జట్టు యజమాని కావ్యా మారన్ జీర్ణించుకోలేకపోయారు. పొంగుకొస్తున్న కన్నీటిని దాచుకోలేకపోయారు. కెమెరాల కంటబడకుండా వెనక్కి తిరిగి ఏడ్చేశారు. కన్నీటిని తుడుచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బాధను అదిమి పెడుతూనే విజేత జట్టుకు చప్పట్లతో అభినందనలు తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కావ్య బాధను నెటిజన్లు కూడా పంచుకున్నారు. క్రికెట్పై అత్యంత మక్కువ కలిగిన ఫ్రాంచైజీ ఓనర్ ఆమె ఒక్కరేనని ప్రశంసించారు. కావ్య ప్రతి మ్యాచ్కు వచ్చి ఆటగాళ్లకు మద్దతుగా నిలిచిందని, జట్టు ఓడినా విజేత జట్టును అభినందించి టీమ్ స్పిరిట్ చూపిందని పలువురు అభినందించారు. గత సీజన్లో జాబితాలో అట్టడుగున ఉన్న హైదరాబాద్ ఈసారి రన్నరప్గా నిలిచినందుకు సంతోషపడాలని మరికొందరు సూచించారు.
ఇవి కూడా చదవండి:
ఖతార్ ఎయిర్వేస్ విమానంలో అల్లకల్లోలం! గాయపడిన 12 మంది ప్రయాణికులు! క్యాబిన్ సిబ్బంది కూడా!
ABV పోస్టింగ్ పై కొనసాగుతున్న ఉత్కంఠ! రిటైర్మెంట్ కు ఇంకా 4 రోజులే! ప్రభుత్వం ఏం చేయనుంది!
ప్రయాణికులకు ముఖ్య గమనిక! యూఏఈ-ఇండియా మధ్య పలు విమానాలు రద్దు! రెమల్ తుఫాను కారణంగా!
కువైట్: అక్రమ మద్యం తయారీ కేంద్రం సీజ్! నలుగురు ప్రవాసులు అరెస్ట్!
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన రేవ్ పార్టీ కేసు! ఏపీ మంత్రి అనుచరుడి అరెస్ట్!
58 లోక్సభ స్థానాలకు మొదలైన పోలింగ్! 6వ దశ పోలింగ్ షురూ! 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో!
హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడిన యువత! రక్షించి విశాఖ చేర్చిన పోలీసులు! చంద్రబాబు X లో పోస్ట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: