ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలోనే ఇన్నాళ్లు టీటీడీ చైర్మన్ గా ఉన్న వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆ పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామంతో టీటీడీకి కాబోయే కొత్త చైర్మన్ ఎవరనే దానిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ పదవి కోసం టీడీపీ, బీజేపీ నేతలు గట్టిగానే లాబీయింగ్ చేస్తున్నట్లుగా సమాచారం.
ఇంకా చదవండి: కేంద్రం గుడ్న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అయితే, ఆ మధ్య జనసేన అధినేత పవన్ సోదరుడు నాగబాబు, ప్రముఖ నిర్మాత అశ్వినిదత్ పేరు బలంగా వినిపించాయి. కానీ, విశ్వసనీయ సమాచారం మేరకు టీటీడీ చైర్మన్ గా టీవీ-5 ఛానల్ యజమాని బీఆర్ నాయుడు పేరును త్వరలోనే ప్రకటించబోతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆంధ్ర రాష్ట్రంలో సుప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి కీలకమైనది కావడంతో చైర్మన్ నియామకంపై కూటమి ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ మహిళలకు చంద్రన్న వరం.. అదిరే శుభవార్త చెప్పారండోయ్! వారెవ్వా ఏం ఐడియా అండి బాబు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: