ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అదిరే గుడ్ న్యూస్ అందించారు. కీలక ప్రకటన చేశారు. రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ చంద్రన్న ఏ ప్రకటన చేశారు? ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? వంటి అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రబాబు నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత త్వరితగతిన డబ్బులు అన్నదాతలకు అందించాలని తెలిపారు. అలస్యం చేయవద్దని పేర్కొన్నారు. 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన ఆయన గత ఐదేళ్లలో అనుసరించిన విధానాలను పక్కన పెట్టాలని సూచించారు. అన్నదాతలకు ఇబ్బందులు లేకుండా అనుకూలంగా ఉండేలా కార్యచరణ చేపట్టాలని సూచించారు. రేషన్ షాపుల్లో మిల్లెట్లు కూడా పంపిణీ చేసేలా చూడాలని సీఎం ఆదేశించారు. మరో వైపు ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చుకుంటూ వెళ్తోంది. ఇందులో భాగంగా సూపర్ సిక్స్ పథకాల అమలుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో మూడు పథకాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటోంది. అన్న క్యాంటిన్, ఆర్టీసీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పథకాలను అమలు చేయనున్నారు.
ఇంకా చదవండి: సొంతిళ్లు ఉన్న వారికి భారీ శుభవార్త! ఒక్కో కుటుంబానికి రూ.78 వేలు! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!
ఈ పథకాల అమలుపై సీఎం చంద్రబాబు నాయుడు పలు శాఖలపై వరుసగా సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అంతే కాదు.. పలు శాఖల నుంచి కూడా నివేదికలు తెప్పించుకుంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే క్రమంలో ఇటీవల సీఎం పలు శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఏపీలో రవాణా శాఖ మంత్రి కూడా కీలక ప్రకటన చేశారు. అతి త్వరలో మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగిచుకుంటారని తెలిపారు. దీని అమలుకు సంబంధించి.. ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్న విధానంపై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ఈ పథకంతో నెలకు రూ.250 కోట్ల వరకు ఖర్చు అవుతుందని సీఎంకు అధికారులు సూచించారు. తల్లికి వందనం పథకంకు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేశారు. ఇక అన్నా క్యాంటీన్ల విషయానికి వస్తే.. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఈ క్యాంటీన్లు ప్రారంభం అయ్యాయి. అధికారికంగా మొత్తం మొదటి విడతలో 100 క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం వెల్లడించింది. ఈ మూడు పథకాలను ఆగస్టు 15వ తేదీన ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ఇంకా చదవండి: కేంద్రం గుడ్న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ మహిళలకు చంద్రన్న వరం.. అదిరే శుభవార్త చెప్పారండోయ్! వారెవ్వా ఏం ఐడియా అండి బాబు!
మందుబాబులకు గుడ్ న్యూస్! భారీగా మద్యం ధరలు తగ్గింపు.. ఎప్పటి నుంచంటే?
రూ.3 లక్షల 50 వేల జీతంతో ఉద్యోగం! మిస్ అవ్వొద్దు, ఈ నెల 3న జాబ్ మేళా! ఆ వివరాలు మీకోసం!
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు! స్పందించిన పవన్ కల్యాణ్! దశాబ్దాల నుంచి కొనసాగతున్న అంశంపై!
పాత ప్రభుత్వం వాలంటీర్లను పట్టించుకోలేదు! అక్రమంగా ఎంత మంది పనిచేస్తున్నారో తెలుసా?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: