ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు పాలనను పరుగులు తీయిస్తున్నారు. తన ఆలోచనలకు అనుగుణంగా అధికారులంతా కష్టపడి పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో కూరగాయలను పండిస్తున్న రైతులు నష్టపోకూడదని, వారికి మంచి ఆదాయం రావాలి, దళారీ వ్యవస్థను నిర్మూలించాలనే లక్ష్యంతో రైతుబజార్లను ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజువరకు ప్రజల జీవితాల్లో అవి విడదీయలేని భాగంగా మారిపోయాయి. కూరగాయలు కావాలంటే మార్కెట్ కు వెళ్లాలనే మాటను మరిచిపోయి కూరగాయలు కావాలంటే రైతు బజారుకు వెళ్లాలని అందరికీ అలవాటైపోయింది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరో నిర్ణయం తీసుకున్నారు. రైతు బజార్లను అన్ని నగరాల్లో ఏర్పాటు చేసేందుకు స్థలాల కొరత తీవ్రంగా ఉండటంతో 100 మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేయబోతున్నారు. అన్ని ప్రధాన నగరాల్లో ఇవి ప్రారంభం కాబోతున్నాయి. ప్రస్తుతం గుంటూరు, విజయవాడ నగరాల్లో 16 రైతు బజార్లు ఉన్నాయి.
ఇంకా చదవండి: మార్చి నాటికి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు! ప్రైవేటు టెలికామ్ సంస్థలు ధరలు - గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి!
ఈ రెండు నగరాల్లో 100 మొబైల్ రైతుబజార్లను ప్రారంభిస్తామని రైతుబజార్ల సీఈవో శేఖర్ బాబు తెలిపారు. కర్నూలు, తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, గంటూరు లాంటి నగరాల్లో గేటెడ్ కమ్యూనిటీ ప్రాంతాలు, శివారు ప్రాంతాలు, అపార్ట్ మెంట్లలో నివసించే ప్రజల కోసం వీటిని అందుబాటులోకి తెస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం 111 రైతుబజార్లు ఉన్నాయి. మదనపల్లి, ఆత్మకూరు, వెలుగోడు, ఆళ్లగడ్డ, పత్తికొండ, ప్రొద్దుటూరు, వేంపల్లి, బాపట్ల, రాయవరం, అంగర, అనపర్తి, సాలూరుల్లో నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి పురపాలక సంఘంలో రైతుబజార్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 98 మున్సిపాలీటీలుటే కేవలం 74 చోట్లే రైతుబజార్లు ఉన్నాయి. కరోనా సమయంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రభుత్వం కూరగాయలను విక్రయించింది. వీటిని జనతా బజార్ పేరుతో నడపాలని చూసినప్పటికీ విజయవంతం కాలేదు. కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులను మొబైల్ రైతు బజార్లుగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. వీటికోసం కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారా? లేదంటే పాత ఆర్టీసీ బస్సులను వినియోగిస్తారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
ఇంకా చదవండి: ఏపీ మహిళలకు చంద్రన్న వరం.. అదిరే శుభవార్త చెప్పారండోయ్! వారెవ్వా ఏం ఐడియా అండి బాబు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మందుబాబులకు గుడ్ న్యూస్! భారీగా మద్యం ధరలు తగ్గింపు.. ఎప్పటి నుంచంటే?
రూ.3 లక్షల 50 వేల జీతంతో ఉద్యోగం! మిస్ అవ్వొద్దు, ఈ నెల 3న జాబ్ మేళా! ఆ వివరాలు మీకోసం!
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు! స్పందించిన పవన్ కల్యాణ్! దశాబ్దాల నుంచి కొనసాగతున్న అంశంపై!
పాత ప్రభుత్వం వాలంటీర్లను పట్టించుకోలేదు! అక్రమంగా ఎంత మంది పనిచేస్తున్నారో తెలుసా?
వైజాగ్ లో 5 ఎకరాలలో అద్భుతమైన మాల్ నిర్మాణం! నగరానికి మణిపూస కానున్న కట్టడాలు! ప్రభుత్వం తరపు నుండి!
జూబెర్ వీడియోలో మెహరున్నీసా ఆచూకీ! నారా లోకేష్ సహాయంతో సౌదీ అధికారులతో చర్చలు!
కుప్పం వైసీపీ కార్యాలయం మూసివేత! MLA భరత్ కనబడకపోవడం పార్టీకి పెద్ద దెబ్బ!
ఏపీలో మరోసారి ఎన్నికలు! ఆ మూడు జిల్లాల్లో కోడ్ అమలులోకి! పోలింగ్ ఎప్పుడంటే!
ఏపీలో వాలంటీర్లకు శుభవార్త! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: