కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏపీపై కేంద్రం ప్రత్యేక ఫోకష్ పెట్టింది. బడ్జెట్ కేటాయింపులు, ప్రాజెక్టులకు నిధులు వంటి అంశాలపై ప్రత్యేక కేటాయింపులు చేస్తోంది. తాజాగా కేంద్రం మరోసారి ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఏపీకి అదనంగా మరో 6.50 కోట్ల పనిదినాలు కేటాయించింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ ఏపీకి కేంద్రం అదనంగా 6.50 కోట్ల పనిదినాలు కేటాయించినట్లు ట్వీట్ చేశారు. పెరిగిన పని దినాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాలకు మరిన్ని రోజులు పనిదినాలు దొరుకుతాయని వెల్లడించారు. దీంతో చాలా మందికి లబ్ధి చేకూరనుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 53 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మొత్తంగా 21.3 కోట్ల పనిదినాలను కేంద్రం ఏపీకి కేటాయించింది. ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాల్సిన బకాయిలను కూడా త్వరగా విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. తాము పంపిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందనందుకు మోదీకి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ ఏపీకి కూడా 15 కోట్ల పనిదినాలు కేటాయించారు. అయితే ఇలా కేటాయించిన 15 కోట్ల పనిదినాలు జూన్ నెలాఖరుకే పూర్తయినట్లు సమాచారం.
ఇంకా చదవండి: చంద్రబాబు పండుగ కానుక అదరహో! ఉచితంగా 3 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అప్పటి నుంచే? ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మందుబాబులకు గుడ్ న్యూస్! భారీగా మద్యం ధరలు తగ్గింపు.. ఎప్పటి నుంచంటే?
రూ.3 లక్షల 50 వేల జీతంతో ఉద్యోగం! మిస్ అవ్వొద్దు, ఈ నెల 3న జాబ్ మేళా! ఆ వివరాలు మీకోసం!
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు! స్పందించిన పవన్ కల్యాణ్! దశాబ్దాల నుంచి కొనసాగతున్న అంశంపై!
పాత ప్రభుత్వం వాలంటీర్లను పట్టించుకోలేదు! అక్రమంగా ఎంత మంది పనిచేస్తున్నారో తెలుసా?
వైజాగ్ లో 5 ఎకరాలలో అద్భుతమైన మాల్ నిర్మాణం! నగరానికి మణిపూస కానున్న కట్టడాలు! ప్రభుత్వం తరపు నుండి!
జూబెర్ వీడియోలో మెహరున్నీసా ఆచూకీ! నారా లోకేష్ సహాయంతో సౌదీ అధికారులతో చర్చలు!
కుప్పం వైసీపీ కార్యాలయం మూసివేత! MLA భరత్ కనబడకపోవడం పార్టీకి పెద్ద దెబ్బ!
ఏపీలో మరోసారి ఎన్నికలు! ఆ మూడు జిల్లాల్లో కోడ్ అమలులోకి! పోలింగ్ ఎప్పుడంటే!
ఏపీలో వాలంటీర్లకు శుభవార్త! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!
కుప్పంలో వైసీపీకి భారీ షాక్! టిడిపి లోకి 15 మంది ఎంపీటీసీలు, ఐదుగురు కౌన్సిలర్లు!
సాక్షి కథనాలపై సైకో ఆగ్రహం! వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను బయట పెట్టిన వార్తలు!
పిన్నెల్లికి బిగ్ షాక్! బెయిల్ పిటీషన్ కొట్టివేత!
ఏపీకి మరో రూ.75వేల కోట్ల పెట్టుబడి! కంపెనీ పేరు ఇప్పుడే చెప్పను! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: