సీఎం చంద్రబాబు రాజధాని విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. మరికొన్ని ప్రాంతాలను రాజధాని ప్రాంతంలో చేర్చుతున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బాపట్ల, పల్నాడు ప్రాంతాలను రాజధాని పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాజధాని ప్రాంతం మరింత పెరగనుంది. జిల్లా హెడ్ క్వార్టర్స్గా బాపట్ల, పల్నాడును రాజధాని పరిథిలోకి తీసుకు వస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటుగా రాజధాని ప్రాంతంలోని రైతులకు చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాజధానిలో భూములు కేటాయించిన సంస్థలకు తమ కార్యలయాలు ఏర్పాటు చేసేందుకే మరో రెండేళ్ల పాటు గడువు పొడిగించడం జరిగిందన్నారు. అమరావతి ప్రాంతంలో దాదాపు 130 సంస్థలకు భూములను కేటాయించడం జరిగిందని, ప్రస్తుతం వారి పరిస్థితి ఏమిటని తెలుసుకునేందుకు సీఆర్డీఏ కమిషనర్ ఇప్పటికే వారితో చర్చలు జరపడం జరిగిందన్నారు. త్వరలో తాము కూడా భూములు తీసుకున్న సంస్థలతో సంప్రదింపులు జరపనున్నట్లు మంత్రి తెలిపారు.
బిట్స్ పిలానీ వంటి సంస్థలను కూడా రాజధాని ప్రాంతానికి తీసుకు వచ్చేలా ప్రయత్నించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలను కూడా రాజధాని ప్రాంతంలో నిర్మించేలా చూడాలని రాష్ట్ర ఎంపీలు అందరికి సంస్థల వారీగా బాధ్యలను అప్పగించడం జరిగిందన్నారు. ఆర్-5 జోన్ విషయం కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో లీగల్ గా స్టడీ చేయమని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు. అమరావతి పరిధిలో నవ నగరాలు కూడా ఉంటాయని తెలిపారు. హ్యపీ నెస్ట్ ప్రాజెక్టును కూడా తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అమరావతిలో నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు హైద్రాబాదు, చెన్నై ఐ.ఐ.టి. నిపుణులకు అప్పగించడం జరిగిందన్నారు. నేడు హైద్రాబాదు ఐ.ఐ.టి. నిపుణులు అమరావతిలో పర్యటించి అధికారులు, ఎమ్ఎల్యేలు, ఎమ్ఎల్సీ, ఎన్జీవోలు, నాలుగో తరగతి నివాస సముదాయాల నిర్మాణాల సామర్థ్యాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. బహుశా శనివారం నాడు చెన్నై ఐ.ఐ.టి. నిపుణుల అమరావతిలో పర్యటించి అసెంబ్లీ, హైకోర్టు, ఐదు టవర్ల నిర్మాణాల సామర్థ్యాన్ని పరిశీలించనున్నట్లు తెలిపారు. నిపుణుల బృందాల నివేదిక ఆధారంగా తగు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు.
ఇంకా చదవండి: నిరుద్యోగులకు చక్కని ఉద్యోగ అవకాశం! గుంటూరులో 100% జాబ్ గ్యారంటీతో ట్రైనింగ్ ప్రోగ్రామ్! 15 నుండి 25 వేల జీతంతో!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రూ.3 లక్షల 50 వేల జీతంతో ఉద్యోగం! మిస్ అవ్వొద్దు, ఈ నెల 3న జాబ్ మేళా! ఆ వివరాలు మీకోసం!
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు! స్పందించిన పవన్ కల్యాణ్! దశాబ్దాల నుంచి కొనసాగతున్న అంశంపై!
పాత ప్రభుత్వం వాలంటీర్లను పట్టించుకోలేదు! అక్రమంగా ఎంత మంది పనిచేస్తున్నారో తెలుసా?
వైజాగ్ లో 5 ఎకరాలలో అద్భుతమైన మాల్ నిర్మాణం! నగరానికి మణిపూస కానున్న కట్టడాలు! ప్రభుత్వం తరపు నుండి!
జూబెర్ వీడియోలో మెహరున్నీసా ఆచూకీ! నారా లోకేష్ సహాయంతో సౌదీ అధికారులతో చర్చలు!
కుప్పం వైసీపీ కార్యాలయం మూసివేత! MLA భరత్ కనబడకపోవడం పార్టీకి పెద్ద దెబ్బ!
ఏపీలో మరోసారి ఎన్నికలు! ఆ మూడు జిల్లాల్లో కోడ్ అమలులోకి! పోలింగ్ ఎప్పుడంటే!
ఏపీలో వాలంటీర్లకు శుభవార్త! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!
కుప్పంలో వైసీపీకి భారీ షాక్! టిడిపి లోకి 15 మంది ఎంపీటీసీలు, ఐదుగురు కౌన్సిలర్లు!
సాక్షి కథనాలపై సైకో ఆగ్రహం! వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను బయట పెట్టిన వార్తలు!
పిన్నెల్లికి బిగ్ షాక్! బెయిల్ పిటీషన్ కొట్టివేత!
ఏపీకి మరో రూ.75వేల కోట్ల పెట్టుబడి! కంపెనీ పేరు ఇప్పుడే చెప్పను! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: