ఉపాధి హామీ పథకం ద్వారా గోకులాల నిర్మాణాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, అర్హులు దరఖాస్తు చేసుకోవాలని మండల పశువైద్యాధికారి బాలా నాయక్ తెలిపారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మండలం లో పశువుల కాపర్లకు మినీ గోకులాలు రాష్త్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. జిల్లా పశువర్ధక శాఖ అధికారి ఆదేశానుసారం 2, 4, 6 ఆవులు ఉన్నవారు రైతుల గోకుల నిర్మాణానికి 90 శాతం ప్రభుత్వం భరించి షెడ్లను మంజూరు చేస్తుందన్నారు. దీనికి గాను రైతులు వాటా కింద డిడి ల రూపంలో రూ. 11500, రూ.18500 , రూ.23,000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. వచ్చిన దరఖాస్తులనుపరిశీలించి అర్హులను గుర్తించి మినీ గోకులాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అలాగే గొర్రెలు,మేకలు, కోళ్లు షెడ్డు కు 70 శాతం ప్రభుత్వం భరించి షెడ్లను మంజూరు చేస్తుందని తెలిపారు. 30% రైతువాట కింద ఉంటుందన్నారు. ఈ చక్కటి అవకాశాన్ని పాడి రైతులందరూ వినియోగించుకోవాలని తమ తమ పరిధిలోని సచివాలయాల ఏ ఎచ్ ఏ సిబ్బందిని సంప్రదించి అప్లికేషన్ ఫామ్ ఒక ఫోటో, ఆధార్ కార్డ్, ఉపాధి హామీ పుస్తకం, క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వవలసి ఉంటుందన్నారు.ఈ అవకాశాన్ని మండల పరిధిలో పాడి రైతులు సద్వినియం చేసుకోవాలని ఆయన కోరారు. మినీ గోకులాలను మహిళల పేరు మీద మంజూరు చేస్తారు. పంచాయితీల్లో గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. పంచాయతీ ప్రత్యేక అధికారి, గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి.. లబ్ధిదారులను గుర్తించారు. ఎంపికైన లబ్ధిదారుల వివరాలను వారివారి పరిధిలోని పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకులు(డీడీ)లకు నివేదిస్తారు. నిబంధనల ప్రకారం వారు యూనిట్లను మంజూరు చేస్తారు.
ఇంకా చదవండి: సంచలన ట్వీట్.. మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరిన లోకేష్! వారిపై తీవ్రస్థాయిలో మండిపాటు! శభాష్ అని పొగుడుతూ సోషల్ మీడియాలో!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు! స్పందించిన పవన్ కల్యాణ్! దశాబ్దాల నుంచి కొనసాగతున్న అంశంపై!
పాత ప్రభుత్వం వాలంటీర్లను పట్టించుకోలేదు! అక్రమంగా ఎంత మంది పనిచేస్తున్నారో తెలుసా?
వైజాగ్ లో 5 ఎకరాలలో అద్భుతమైన మాల్ నిర్మాణం! నగరానికి మణిపూస కానున్న కట్టడాలు! ప్రభుత్వం తరపు నుండి!
జూబెర్ వీడియోలో మెహరున్నీసా ఆచూకీ! నారా లోకేష్ సహాయంతో సౌదీ అధికారులతో చర్చలు!
కుప్పం వైసీపీ కార్యాలయం మూసివేత! MLA భరత్ కనబడకపోవడం పార్టీకి పెద్ద దెబ్బ!
ఏపీలో మరోసారి ఎన్నికలు! ఆ మూడు జిల్లాల్లో కోడ్ అమలులోకి! పోలింగ్ ఎప్పుడంటే!
ఏపీలో వాలంటీర్లకు శుభవార్త! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!
కుప్పంలో వైసీపీకి భారీ షాక్! టిడిపి లోకి 15 మంది ఎంపీటీసీలు, ఐదుగురు కౌన్సిలర్లు!
సాక్షి కథనాలపై సైకో ఆగ్రహం! వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను బయట పెట్టిన వార్తలు!
పిన్నెల్లికి బిగ్ షాక్! బెయిల్ పిటీషన్ కొట్టివేత!
ఏపీకి మరో రూ.75వేల కోట్ల పెట్టుబడి! కంపెనీ పేరు ఇప్పుడే చెప్పను! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: