ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు మీద ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ఒక వర్గం నిరంతర పోరాటానికి దక్కిన ఫలితమన్నారు. ఎస్సీలలో ఐక్యత చెక్కుచెదరకుండా చూడాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన బహిరంగ ప్రకటనను విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని పేర్కొన్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ మంద కృష్ణ మాదిగ పోరాటం చేశారని కితాబునిచ్చారు. ఈ పోరాటాలకు ఫలితం దక్కిందన్నారు. మంద కృష్ణకు అభినందనలు తెలిపారు. మాదిగలకు రిజర్వేషన్ కల్పనకు ప్రధాని మోదీ రెండో టర్మ్లో సానుకూలంగా స్పందించిన విషయాన్ని గుర్తు చేశారు. వర్గీకరణ ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న లక్ష్యం నెరవేరుతుందని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు తెలిపిందన్నారు. మోదీ ప్రభుత్వం గతంలో వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే, చంద్రబాబు ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దశాబ్దాల నుంచి కొనసాగతున్న అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడటం హర్షణీయమన్నారు. వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన ఈ తీర్పు తర్వాత ఎస్సీలలో ఐక్యత చెక్కుచెదరకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ వర్గం మేధావులు, విద్యావంతులపై ఉందని పేర్కొన్నారు. దశాబ్దాలుగా వర్గీకరణ కోసం పోరాడుతున్నారంటే అందుకు వారి ఆందోళనను అర్థం చేసుకోవాలన్నారు. ఎస్సీ వర్గీకరణ జరిగి మాదిగ సామాజికవర్గం కూడా ముందుకు రావాలని కోరుకునే మాల సామాజిక వర్గం విద్యావేత్తలు ఉన్నారని పేర్కొన్నారు.
ఇంకా చదవండి: సంచలన ట్వీట్.. మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరిన లోకేష్! వారిపై తీవ్రస్థాయిలో మండిపాటు! శభాష్ అని పొగుడుతూ సోషల్ మీడియాలో!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పాత ప్రభుత్వం వాలంటీర్లను పట్టించుకోలేదు! అక్రమంగా ఎంత మంది పనిచేస్తున్నారో తెలుసా?
వైజాగ్ లో 5 ఎకరాలలో అద్భుతమైన మాల్ నిర్మాణం! నగరానికి మణిపూస కానున్న కట్టడాలు! ప్రభుత్వం తరపు నుండి!
జూబెర్ వీడియోలో మెహరున్నీసా ఆచూకీ! నారా లోకేష్ సహాయంతో సౌదీ అధికారులతో చర్చలు!
కుప్పం వైసీపీ కార్యాలయం మూసివేత! MLA భరత్ కనబడకపోవడం పార్టీకి పెద్ద దెబ్బ!
ఏపీలో మరోసారి ఎన్నికలు! ఆ మూడు జిల్లాల్లో కోడ్ అమలులోకి! పోలింగ్ ఎప్పుడంటే!
ఏపీలో వాలంటీర్లకు శుభవార్త! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!
కుప్పంలో వైసీపీకి భారీ షాక్! టిడిపి లోకి 15 మంది ఎంపీటీసీలు, ఐదుగురు కౌన్సిలర్లు!
సాక్షి కథనాలపై సైకో ఆగ్రహం! వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను బయట పెట్టిన వార్తలు!
పిన్నెల్లికి బిగ్ షాక్! బెయిల్ పిటీషన్ కొట్టివేత!
ఏపీకి మరో రూ.75వేల కోట్ల పెట్టుబడి! కంపెనీ పేరు ఇప్పుడే చెప్పను! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: