ఏపీలోని గన్నవరం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు విమాన సర్వీసులు నడపాలన్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని విజ్ఞప్తి పట్ల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారు. గన్నవరం నుంచి వారణాసి, అహ్మదాబాద్, పూణే, కోల్ కతా, బెంగళూరు వంటి నగరాలకు విమానాలు నడపాలని కేశినేని చిన్ని కోరారు. విజయవాడ నుంచి వారణాసి వయా వైజాగ్... విజయవాడ నుంచి కోల్ కతా వయా విశాఖపట్నం... విజయవాడ నుంచి బెంగళూరు వయా హైదరాబాద్ లేదా కొచ్చి... విజయవాడ నుంచి అహ్మదాబాద్... విజయవాడ నుండి పూణేలకు విమాన సర్వీసుల ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఇండిగో సర్వే చేసిన ఈ మార్గాల్లో వెంటనే విమానాలు నడపాలని కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు వినతిపత్రం అందించారు. ఈ వినతిపత్రాన్ని తప్పకుండా పరిశీలించి చర్యలు తీసుకుంటామని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారని కేశినేని చిన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ మంత్రికి తప్పిన ప్రమాదం! అసలు ఏం జరిగిందంటే!
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలులో కీలక పరిణామం! సీఏం చంద్రబాబు తుది నిర్ణయం!
11మంది బలం సరిపోలేదా అంటూ - జగన్ వ్యాఖ్యలకు వైఎస్ షర్మిల కౌంటర్! క్రైస్తవులను ఊచకోత గురి చేసినా..
రెడ్ బుక్ అంటే చాలు.. వైసీపీ నేతలకు భయం! రాష్ట్రంపై అసత్య ప్రచారం! టీడీపీ ఎంపీ ఫైర్!
పారిస్ ఒలింపిక్స్లో అరకు కాఫీ ఘుమఘుమలు! అతిథులను అలరించనున్న మన్యం పంట!
ఆగస్టులో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవలు! ఆ వివరాలు మీకోసం!
ప్రతిపక్ష నేత హోదా పిటిషన్పై విచారణ! హైకోర్టు ఏం తీర్పు ఇవ్వనుంది!
జగన్ ఢిల్లీలో స్థిరపడేందుకు షెల్టర్ అవసరం! కూటమిలో చేరడం అనివార్యం- యనమల రామకృష్ణుడు!
అసత్య ప్రచారాలు చేస్తున్న మీడియాపై మండిపడ్డ మంత్రి లోకేష్! ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటాం!
నేను నోరు విప్పితే జగన్ జైలుకే! బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: