ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం అరవింద్ కేజీవాల్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. అదేవిధంగా కేజీవాల్ పిటిషన్ ను ఐదురుగు సభ్యులు కలిగిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ప్రకటించింది. ఈ క్రమంలోనే కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేజ్రివాల్ ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి అంటూ కామెంట్ చేసింది. కాగా, సీఎం అరవింద్ కేజ్రివాల్ను లిక్కర్ స్కాం కేసులో మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఢిల్లీ మద్యం పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ.. కేజ్రివాల్ సుప్రీం కోర్టుకు వెళ్లారు. అక్కడ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్త నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం కేజీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టింది. కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మే 17న తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ వెంటనే జూన్ 20న కేజీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టు క్యాజువల్ బెయిల్ మంజూరు చేయగా, ఆ మరుసటి రోజే ఢిల్లీ హైకోర్టు స్టే ఇవ్వడం వివాదాస్పదంగా మారింది.
ఇవి కూడా చదవండి:
కవిత డిఫాల్ట్ బెయిల్ పేటీషన్ పై నేడు విచారణ! బెయిల్ వస్తుందా రాదా!
భోగాపురం ఎయిర్ పోర్ట్ పై చంద్రబాబు కీలక ప్రకటన! ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే!
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్! కేంద్రమంత్రి హామీ!
టీ-టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా బ్రాహ్మణి! తెలంగాణపై బాబు ప్రత్యేక ఫోకస్!
'తల్లికి వందనం' పదకంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! వారు మాత్రమే అర్హులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: