బీఎస్పీ తమిళనాడు చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసులో 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నై పెరంబూర్లోని నివాసం దగ్గర శుక్రవారం రాత్రి ఆరుగురు వ్యక్తులు ఆయనపై కత్తిదాడి చేశారు. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. కాగా.. హత్య కేసులో 8 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. "ఆర్కాట్ సురేష్ అనే గ్యాంగ్ స్టర్ హత్యతో ఆర్మ్ స్ట్రాంగ్ కు సంబంధం ఉందని అనుమానిస్తున్నాం. ఇది ప్రతీకార హత్య కావచ్చు. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు గ్యాంగ్ స్టర్ హత్యతో ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది" అని చెన్నై సీనియర్ పోలీసు అధికారి అస్రా గార్గ్ చెప్పారు. ఫుడ్ డెలివరీ ఏజెంట్లుగా వచ్చి ఆర్మ్ స్ట్రాంగ్ పై దాడిచేసినట్లు కథనాలు రాగా పోలీసులు వాటిని ఇంకా ధ్రువీకరించలేదు. ఇకపోతే, ఉన్నతాధికారులు ఈ కేసు దర్యాప్తును సెంబియం ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కి అప్పగించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తమిళనాడులోని అధికార డీఎంకేపై ప్రతిపక్షం విరుచుకుపడింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయనడానికి ఈ హత్యే నిదర్శమని అన్నారు. "జాతీయ పార్టీ రాష్ట్ర అధినేత హత్యకు గురైతే ఏం చెప్పగలను. శాంతిభద్రతలు క్షీణించాయి. చట్టానికి, పోలీసులకు ఎవరూ భయపడట్లేదు" అని ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి అన్నారు. ఆర్మ్ స్ట్రాంగ్ హత్యపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. ఆర్మ్ స్ట్రాంగ్ హత్య చాలా విచారకరమని.. దాన్ని ఖండిస్తున్నానని అన్నారు. దళితుల బలమైన గొంతుకగా పేరు పొందారని పేర్కొన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని మాయావతి పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి:
మీడియా ముందు ప్రత్యక్షమైన భోలే బాబా! హత్రాస్ ఘటనపై ఏమన్నారంటే!
ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దుర్గమ్మ ఆషాడ ఉత్సవాలు! 16 వరకూ వారాహి నవరాత్రులు!
తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ దారుణ హత్య! ఫుడ్ డెలివరీ ఏజెంట్స్గా వచ్చి దాడి!
చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీలో అంత ముఖ్యమైన టాపిక్ పై నో డిస్కషన్! ఎందుకంటే!
లిక్కర్ కేసులో కవితకు బెయిల్ కోసం కీలక నిర్ణయం! రంగంలోకి KTR, హరీష్ రావు!
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! అతి త్వరలో విజయవాడ నుండి కుర్నూల్ కు సర్వీసులు ప్రారంభం!
రేవంత్ రెడ్డితో భేటీపై స్పందించిన చంద్రబాబు! ఏమన్నారంటే!
వచ్చే నెల వరకూ సాగునీరు లేనట్టే! కృష్ణా డెల్టా రైతులకు బిగ్ షాక్!
జనసేనాని కొన్న మూడు ఎకరాల భూమి ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ఎందుకు కొన్నారంటే!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! రూ. 60 వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ! త్వరలోనే అధికారిక ప్రకటన!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: