అమరావతి : దేవాదాయశాఖలో అక్రమార్కులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అవినీతి ఆరోపణలతో అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతి సస్పెన్షన్ కు గురయ్యారు. అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతిని దేవాదాయశాఖ కమిషనర్ సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఒకేసారి దేవాదాయశాఖ అధికారిగా శాంతి పనిచేశారు. విజయవాడ బ్రాహ్మణవీధిలోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన షాపుల తనిఖీల్లో తప్పుడు నివేదికలు ఇచ్చినట్లు విచారణలో వెల్లడయ్యింది. షాపులను కూల్చివేసి.. అక్రమ నిర్మాణాలు చేసినా శాంతి పట్టించుకోలేదు. ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ ఆదేశాలు అమలు చేయలేదని నిర్ధారణ అయ్యింది. అక్రమార్కులకు అండగా ఉన్నట్లు విచారణలో వెల్లడి అవ్వడంతో శాంతిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టిన దేవాదాయశాఖ కమిషనర్.
ఇవి కూడా చదవండి:
శ్రీవారి అన్నప్రసాదం తయారీపై టీటీడీ కీలక నిర్ణయం! భక్తుల ఫిర్యాదులు పరిగణనలోకి!
సీబీఐకి హై కోర్టు నోటీసులు! కేజ్రీవాల్ అరెస్ట్ పై విచారణ!
ఏపీలో పెన్షన్ ఒక్క నెల తీసుకోకపోయినా రద్దు అవుతుందా? చంద్రబాబు కీలక ప్రకటన!
ఈ నెల 6 న తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ సీన్! భేటీకి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్!
వైసీపీ ఓటమికి ముఖ్య కారణం అదే! కీలక విషయాలు బయటపెట్టిన CPI నారాయణ!
జగన్ రెడ్డికి మరో షాక్ ఇచ్చేందుకు వ్యూహం రెడీ! ముహూర్తం ఫిక్స్ చేసిన చంద్రబాబు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: