తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన సమస్యలపై చర్చిద్దామని, ముఖాముఖి భేటీతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని.. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అయినా కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయని లేఖలో చంద్రబాబు గుర్తు చేశారు. ఇందుకోసం ఈ నెల 6వ తేదీన ఫేస్ టూ ఫేస్ భేటీ అయ్యి ఈ అంశాలపై చర్చిద్దామని రేవంత్ రెడ్డిని చంద్రబాబు కోరారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు విజ్ఞప్తికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి రేపు (మంగళవారం) తిరిగి లేఖ రాయనున్నట్లు సమాచారం. చంద్రబాబు విజ్ఞప్తికి రేవంత్ సానుకూలంగా స్పందించడంతో ఈ నెల 6వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరగనుంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
హైదరాబాద్ లోని ప్రజా భవన్లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో రాష్ట్ర విజభన అంశాలు, ఏండ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న అపరిష్కృత టాపిక్స్పై ఇరువురు చర్చించనున్నట్లు టాక్. కాగా, తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. రెండు స్టేట్ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. రాజకీయాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చంద్రబాబు శిష్యుడిగా పిలుస్తుంటారు. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో రేవంత్కు సీఎం పోస్ట్ దక్కగా, ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో చంద్రబాబు నాలుగోసారి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో గురు శిష్యులు ఇద్దరూ సీఎంల హోదాలో ఫస్ట్ టైమ్ భేటీ కావడం రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ మారింది.
ఇవి కూడా చదవండి:
బస్సులో సీటు కోసం 11 లక్షలు పోగొట్టుకున్నాడు! ఎలాగో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
జగన్ రెడ్డికి మరో షాక్ ఇచ్చేందుకు వ్యూహం రెడీ! ముహూర్తం ఫిక్స్ చేసిన చంద్రబాబు!
ఏపీకి మరో నాలుగు రోజులపాటు వర్ష సూచన! వతావరణ శాఖ హెచ్చరిక!
జీతం తీసుకోను... ఫర్నీచర్ కూడా నేనే తెచ్చుకుంటా! డిప్యూటీ సీఎం సంచలన నిర్ణయం!
ప్రజా నాయకుడికి, పరదాల నాయకుడికి తేడా ఏంటో ప్రజలకు తెలిసింది! మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
హిందూ సమాజం అంటే ఒక్క మోడీ మాత్రమే కాదు! ప్రధానిపై రాహుల్ గాంధీ ఫైర్!
వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! ఉంచుతారా... తొలగిస్తారా?
నలుగురు ఐఏఎస్ల పదవీ విరమణ! జగన్ చెంచా జవహర్ రెడ్డి కూడా! రిటైర్ అయినా ఇతన్ని వదిలే ప్రసక్తి ఉండదు!
ఇకపై సీఎం చంద్రబాబును కలిసి మీ సమస్యలు చెప్పుకోవచ్చు! టోల్ ఫ్రీ నెంబర్ ఇదే!
లబ్దిదారు ఇంటికి వెళ్లి మరీ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు! ఏపీలో పింఛన్ల పంపిణీ సందడి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: