ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో పిఠాపురం ఎమ్మెల్యేగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారి పిఠాపురం నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖలో ఎన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయో తెలియట్లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ, జీతం తీసుకుని పని చేద్దాం అనుకున్నా, కానీ 'శాఖలో డబ్బులు లేకపోవడం, వేల కోట్ల అప్పులు చూసి ఎమ్మెల్యేగా జీతం వద్దని చెప్పాను' అని పవన్ కళ్యాణ్ అన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
క్యాంప్ ఆఫీసులో మరమ్మత్తులు ఏమైనా చేయాలా? అని అడిగితే వద్దన్నా! కొత్త ఫర్నిచర్ కొనొద్దు, నేను తెచ్చుకుంటా! అని చెప్పా అని పేర్కొన్నారు. ఈ క్రమంలో వలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయాని వైసీపీ నేతలు ఊదరగొట్టారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఇవాళ వలంటీర్లు లేరు. పెన్షన్లు ఆగాయా? రెట్టింపైన పెన్షన్ను కూడా సచివాలయ ఉద్యోగులు ఇళ్లకు వచ్చి ఇస్తున్నారు. గతంలో 4-5 రోజులు ఇచ్చేవారు. కానీ నేడు రాత్రి, రేపు ఉదయం లోగా 100 శాతం పెన్షన్లు ఇస్తాం అన్నారు. వలంటీర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా కల్పించాలన్న దాని పై ఆలోచిస్తాం ..అని పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
హిందూ సమాజం అంటే ఒక్క మోడీ మాత్రమే కాదు! ప్రధానిపై రాహుల్ గాంధీ ఫైర్!
వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! ఉంచుతారా... తొలగిస్తారా?
నలుగురు ఐఏఎస్ల పదవీ విరమణ! జగన్ చెంచా జవహర్ రెడ్డి కూడా! రిటైర్ అయినా ఇతన్ని వదిలే ప్రసక్తి ఉండదు!
ఇకపై సీఎం చంద్రబాబును కలిసి మీ సమస్యలు చెప్పుకోవచ్చు! టోల్ ఫ్రీ నెంబర్ ఇదే!
లబ్దిదారు ఇంటికి వెళ్లి మరీ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు! ఏపీలో పింఛన్ల పంపిణీ సందడి!
రాష్ట్రవ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్లు పంపిణీ! ఏటా అయ్యే ఖర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
రైతులకు అన్యాయం జరిగితే సహించం! కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: