వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లాల్లో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాలను ఉద్దేశించి తాజాగా ఆయన ఎక్స్లో స్పందించారు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కూడా జగన్ అంత విలాసవంతమైన జీవితం గడిపి ఉండరని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్పై పలు ప్రశ్నలతో విరుచుకుపడ్డారు.
దేశంలో ఎవరికీ లేని స్థాయిలో సెక్యూరిటీ ఎందుకు పెట్టుకున్నారని జగన్ను ప్రశ్నించారు. చివరికి ప్రధానమంత్రి, రాష్ట్రపతికి మించిన స్థాయిలో జగన్ తన ప్యాలెస్ల వద్ద వందలమందితో భద్రతా వలయం ఏర్పాటు చేసుకున్నారని ధ్వజమెత్తారు. ప్యాలెస్ల వద్ద 986 మందితో నిరంతర భద్రతా ఏర్పాటు దేనికోసమని ప్రశ్నించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తాడేపల్లి ప్యాలెస్ వద్ద స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ నుంచి 379 మంది, ఇతర విభాగాల నుంచి 439 మంది, అలైడ్ విధుల కోసం 116 మంది కలిపి 934 మందితో భద్రత ఎందుకు ఏర్పాటు చేసుకున్నట్టని నిలదీశారు. హైదరాబాద్లోని లోటస్పాండ్ ప్యాలెస్ వద్ద 9 మంది, ఇడుపులపాయ ప్యాలెస్ వద్ద 33 మంది, పులివెందుల నివాసం వద్ద 10 మందితో భద్రత ఎందుకని నిలదీశారు.
తాడేపల్లి ప్యాలెస్ చుట్టుపక్కల 48 చోట్ల చెక్ పోస్టులు, అవుట్ పోస్టులు, పోలీస్ పికెట్లు, బ్యారికేడ్లు, 439 మందితో ప్యాలస్ నలుమూలల అడుగుకో పోలీస్ పోస్ట్, చెక్ పోస్ట్, బూమ్ బారియర్లతో భద్రత ఎందుకోసమని జగన్ను ప్రశ్నించారు. జగన్ భద్రత కోసం 24 గంటలూ అందుబాటులో ఉండేలా సమీపంలోని నివాసాల పై డ్రోన్ల తో పర్యవేక్షణ ఎందుకోసమని ప్రశ్నించారు.
ఇంకా చదవండి: బ్రిడ్జి నుంచి వేలాడుతూ రైలు ఇంజెన్కు రిపేర్! లోకోపైలట్ల సాహసం!
30 అడుగుల ఎత్తున ఐరన్ వాల్ ఏర్పాటు చేసుకున్న ప్యాలస్కు ఇద్దరు డీఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులతో నిరంతరం భద్రతా పర్యవేక్షణ ఎందుకోసమని నిలదీశారు. జెడ్ప్లస్ క్యాటగిరీలో ఉన్న చంద్రబాబు సైతం ఏనాడూ ఈ స్థాయి భద్రతను ఏర్పాటు చేసుకోలేదని పోలీసులే చెవులు కొరుక్కుంటున్నారని పేర్కొంటున్నారు. ఇలాంటి వింత పోకడలు, ఇలాంటి అభద్రతా భయాల మధ్య జగన్ ఎందుకు గడపాల్సి వచ్చిందో పెరుమాళ్లకే ఎరుకని గంటా శ్రీనివాసరావు తన పోస్టులో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
‘యువగళం’ చానల్తో టీడీపీకి ఎలాంటి సంబంధమూ లేదు! త్వరలోనే చర్యలు ఉంటాయని హెచ్చరిక!
మీ ఐఆర్సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్లు బుక్ చేస్తే జైలుకే! తస్మాత్ జాగ్రత్త!
ఆస్ట్రేలియా: మెల్బోర్న్ లో ఘనంగా కూటమి విజయోత్సవ సంబరాలు! ముఖ్య అతిధిగా మాజీ మంత్రివర్యులు!
దేశవ్యాప్తంగా ముగిసిన 'నీట్' రీ ఎగ్జామ్! ఎంత మంది హాజరయ్యారో తెలుసా!
ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా వైసీపీకి అహంకారం దిగలేదు! విపక్షం రాని సభను ఇప్పుడే చూస్తున్నాం!
అతి త్వరలో అమరావతికి రైల్వే లైన్! భూసేకరణ షురూ!
రుషికొండ ప్యాలెస్ ను తనకు అమ్మాలి అంటూ చంద్రబాబుకు లేఖ! అది రాసింది ఎవరో కాదు!
పేపర్ లీక్ లను అరికట్టేందుకు యోగీ సర్కార్ కొత్త చట్టం! అత్యంత కఠినంగా రూల్స్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: