నిబంధనలకు విరుద్ధంగా ఉందని అమరావతిలోని తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చేశారు. తాడేపల్లి మండలం సీతానగరం వద్ద నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని ఇవాళ ఉదయం 5.30 గంటల ప్రాంతంలో పోలీసుల పహారా మధ్య ప్రొక్లెయినర్లు, బుల్డోజర్లతో సీఆర్డిఏ అధికారులు కూల్చేశారు. ఫస్ట్ ఫ్లోర్ పూర్తయి, శ్లాబ్ కు సిద్ధమవుతున్న టైంలో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. నీటిపారుదల శాఖ స్థలంలో భవనం నిర్మిస్తున్నారని, అందుకే చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. కూల్చే సమయంలో అటుగా కార్యకర్తలు, నేతలు రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. తర్వాత భారీ భద్రత మధ్య కూల్చివేతలు సాగాయి. ఇక నిర్మాణంలో ఉన్న ఈ భవనాన్ని కూల్చేయాలన్న సీఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ను సవాల్చేస్తూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇదే విషయాన్ని సీఆర్డీఏ కమిషనర్ దృష్టికి వైసీపీ న్యాయవాది తీసుకెళ్లారు. అయినప్పటికీ సీఆర్డీఏ కూల్చివేతలు చేపట్టింది. ఇదే విషయాన్ని మరోసారి హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని వైసీపీ చెబుతోంది.
ఇంకా చదవండి: అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వం అన్నారు! నాగబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్! ఈ క్షణం కోసం ఎన్నాళ్లుగానో!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కొడాలికి గట్టి షాక్! గుడివాడ పోలీసులు కేసు నమోదు! బూతుల పర్వం ఇక ముగియనుందా?
మామ మీ కోసం బంపర్ ఆఫర్ తెచ్చా! రూ.6 లక్షలకే కొత్త కారు! ఆపై రూ.74 వేల వరకు తగ్గింపు!
సుప్రీంకోర్టులో విచారణ! నీట్ పేపర్ లీకేజీపై కేంద్రం! ఎన్టీఏకు నోటీసులు!
లాభాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్, నిఫ్టీ! చరిత్ర సృష్టించే దిశాగా స్టాక్!
కెనడాలో భారత సంతతి సేల్స్ ఎగ్జిక్యూటివ్ దారుణ హత్య! అసలు ఎందుకు చంపారు? కారణం?
ఈ నెల 21 నుంచి ఆగస్టు 15 వరకు రైళ్లు రద్దు! ట్రాక్ నిర్వహణ పనులతో 11 రైళ్లను!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: