అమరావతి, జూన్ 16 : నిరుపేదలకు కేవలం రూ.5/- లకే ఉదయం టిఫిను, రూ.5/- లకే మద్యాహ్న భోజనం మరియు రూ.5/- లకే రాత్రికి భోజనం అందజేసే అన్నా క్యాంటీన్లను మూడు వారాల్లో పునరుద్దరిస్తామని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ పేర్కొన్నారు. వెగలపూడి రాష్ట్ర సచివాలయంలో ఆదివారం ఉదయం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అన్నా క్యాంటీన్ల పునరుద్దరణపై మున్సిఫల్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తొలిసారిగా చేసిన ఐదు సంతకాల్లో అన్నా క్యాంటీన్ల పునరుద్దరణ ఫైల్ కూడా ఉందన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో 203 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినప్పటికీ 184 క్యాంటీన్లను ప్రారంభించగా మిగిలిన 19 క్యాంటీన్లు నిర్మాణ దశలో ఉండిపోవడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ కేంద్రాల్లో ఆహ్లదకరమైన వాతావరణంలో నిరుపేదలకు కేవలం రూ.5/- లకే ఉదయం టిఫిను, రూ.5/- లకే మద్యాహ్న భోజనం మరియు రూ.5/- లకే రాత్రికి భోజనం అందజేసే అన్నా క్యాంటీన్ల వ్యవస్థను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. అయితే నిర్వీర్యం అయిపోయిన అన్నా క్యాంటీను పునరుద్దరించేందుకు అవసరమైన మరామత్ములు చేసేందుకు అంచనాలను రెండు మూడు రోజుల్లో అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
గతంలో అన్నా క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను ఇస్కాన్ ఆధ్యాత్మిక సంస్థకు అప్పగించండం జరిగిందని, మూడు పూట్లా ఆహారం అందజేసేందుకు రోజుకు రూ.73/- లను చార్జి చేయడం జరిగిందన్నారు. అయితే అన్నా క్యాంటీన్ల ద్వారా రోజుకి కేవలం రూ.15/- లకే మూడు పూట్లా ఆహారం అందజేస్తూ మిగిలిన రూ.58/- లను రాయితీగా ప్రభుత్వమే భరించడం జరిగిందన్నారు. రోజుకి 2.25 లక్షల మంది అన్నా క్యాంటీన్ల ద్వారా భోజనం చేసే వారని, తమ హయాంలో మొత్తం మీద 4 కోట్లు 60 లక్షల 31 వేల 600 ప్లేట్ల భోజన్నాన్ని అన్నా క్యాంటీన్ల ద్వారా పంపిణీ చేయడం జరిగిందన్నారు. తొలుత మున్సిఫల్ ప్రాంతాల్లో ఈ అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగిందని, ఆ క్యాంటీన్లకు ప్రజల ఆధరణ ఎంతగానో ఉండటాన్ని గమనించిన చాలా మంది శాసన సభ్యులు గ్రామీణ ప్రాంతాలో కూడా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని అప్పటి ముఖ్యమంత్రిని కోరగా, గ్రామీణ ప్రాంతాలకు కూడా మరో 150 అన్నా క్యాంటీన్లను ముంజూరు చేయడం జరిగిందన్నారు. పెద్ద ఎత్తున ప్రజల ఆధరణను పొందిన అన్నా క్యాంటీన్లను మళ్లీ పునరుద్దరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమోదంతో త్వరలోనే చర్యలు చేపట్టనున్న ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి:
పోలవరం ప్రాజెక్ట్ లో వైసీపీ 2శాతం కూడా పూర్తిచేయలేదు! మంత్రి నిమ్మల రామానాయుడు!
కువైట్: రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో వ్యర్థాల తొలగింపు! ఏకంగా 400 శాతం పెరుగుదల!
వైసీపీ ప్రభుత్వంలో భారీగా భూ కబ్జాలు! ఇప్పడు పరారీ లో నేతలు!
పార్టీ కార్యాలయంలో బారికేడ్లు! పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం! పొలవరంతోనే మొదలు!
కువైట్: గాయాలపాలైన వారిని పరామర్శించిన టీడీపీ, జనసేన నాయకులు! ఎక్కువ మంది వారే!
రాష్ట్ర ప్రక్షాళనను తిరుమల నుండి మొదలుపెట్టిన చంద్రబాబు! అన్నీ విభాగాల్లో మార్పులు!
విద్యుత్ కొనుగోలు అంశంలో కేసీఆర్ వివరణ! సీఏం రేవంత్ రెడ్డిపై విమర్శలు!
అనంతపురం: నా పెద్ద కొడుకు రూ.4 వేలు పెన్షన్ ఇస్తున్నాడు! గర్వంగా తొడకొట్టిన వృద్ధురాలు!
మంగళగిరి ప్రజలకోసం లోకేష్ “ప్రజాదర్బార్”! తొలి అడుగులోనే యువనేత సంచలన నిర్ణయం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: