టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన సీఎం చంద్రబాబు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి పార్టీ కార్యాలయానికి చంద్రబాబు వచ్చారు. సీఎం చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన నేతలు, కార్యకర్తలు. టీడీపీ అభిమానులతో సందడిగా మారిన ఎన్టీఆర్ భవన్. పార్టీ ఆఫీస్లో మీడియాతో సీఎం చంద్రబాబు చిట్చాట్. నాకు-ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు ఉండొద్దు అని ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల వినతుల స్వీకరణకు ప్రత్యేక ఆలోచన చేస్తున్నాం. అభిప్రాయాలు తీసుకుని ఉత్తమ విధానం అమలు చేస్తాం. సమస్యల పరిష్కారానికి నిర్ధిష్ట సమయం ఉండేలా చర్యలు. ప్రజా వినతుల స్వీకరణకు ఎక్కువ సమయం కేటాయిస్తాం. సచివాలయానికి రాకపోకల కోసం రవాణా ఇతరత్రా వెసులుబాటులన్నీ అందుబాటులోకి తెస్తా. ప్రజావేదిక ఉంటే వినతుల స్వీకరణకు అనువుగా ఉండేది.. కానీ జగన్ ప్రజావేదికను కూల్చి వేశాడు. విధ్వంస పాలనకు ప్రతీకగా ప్రజావేదిక అలానే ఉంటుంది. త్వరలోనే క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభిస్తా. అసెంబ్లీ సమావేశాలపై త్వరలోనే నిర్ణయం తీసుకొనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఒకప్పుడు ముగ్గురు నలుగురు పోలీసులు ఉండే పార్టీ ఆఫీసు లో నిన్న ఒక్కసారిగా పోలీసులు కుప్పలుతెప్పలుగా వచ్చారు. చుట్టూ ఉన్న అపార్ట్మెంట్ లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎప్పుడు లేనంతగా ట్రాఫిక్ దారుణంగా పెరిగిపోయింది. సీఏం ను చూసేందుకు వచ్చిన ప్రజాలు అందరికీ ట్రాఫిక్ తిప్పలు తప్పలేదు.
ఇవి కూడా చదవండి:
పార్టీ కార్యాలయంలో బారికేడ్లు! పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం! పొలవరంతోనే మొదలు!
కువైట్: గాయాలపాలైన వారిని పరామర్శించిన టీడీపీ, జనసేన నాయకులు! ఎక్కువ మంది వారే!
రాష్ట్ర ప్రక్షాళనను తిరుమల నుండి మొదలుపెట్టిన చంద్రబాబు! అన్నీ విభాగాల్లో మార్పులు!
విద్యుత్ కొనుగోలు అంశంలో కేసీఆర్ వివరణ! సీఏం రేవంత్ రెడ్డిపై విమర్శలు!
అనంతపురం: నా పెద్ద కొడుకు రూ.4 వేలు పెన్షన్ ఇస్తున్నాడు! గర్వంగా తొడకొట్టిన వృద్ధురాలు!
మంగళగిరి ప్రజలకోసం లోకేష్ “ప్రజాదర్బార్”! తొలి అడుగులోనే యువనేత సంచలన నిర్ణయం!
కువైట్ అగ్ని ప్రమాదంలో మృత్యుంజయులు! రెండవ అంతస్తు నుండి!
గతంలో శాసనమండలిని రద్దు చేయాలన్నాడు! ఇప్పుడేమో ఎమ్మెల్సీలతో భేటీ! జగన్ పై RRR కామెంట్స్!
ఇకపై రాష్ట్రంలో పేదలకు ఆకలి బాధ ఉండదు! అన్న క్యాంటీన్లు మళ్ళీ వచ్చేస్తున్నాయి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: