ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్కుమార్ ప్రసాద్ నియమితులయ్యే అవకాశం ఉంది. 1987 బ్యాచ్కు చెందిన ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఆయన ఉండవల్లిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఇంకా చదవండి: లోకేశ్కి ముఖ్యమైన శాఖలు! చంద్రబాబు నిర్ణయం!
ప్రస్తుతం ఉన్న ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్ రెడ్డి గురువారం సెలవుపై వెళ్లారు. జూన్ నెలాఖరుకు ఆయన పదవీ విరమణ చేయనున్నారు. నీరభ్కుమార్ ప్రసాద్ నియామకంపై నేడు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో సీఎంఓ ఏర్పాటుపై కసరత్తు ప్రారంభమైంది. ముద్దాడ రవిచంద్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. త్వరలోనే మరో ఇద్దరు, ముగ్గురు అధికారులను నియమించే అవకాశం ఉంది.
ఇంకా చదవండి: టీడీపీ-వైసీపీ నేతల మధ్య దాడులు! తిరుపతి జిల్లాలో ఘర్షణ చోటు!
ఎన్నికల ఫలితాల అనంతరం, చంద్రబాబును సీఎస్ జవహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు.
ఇదే సమయంలో, వైఎస్సార్సీపీకి అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలు జవహర్ రెడ్డిపై ఉన్నాయని జనసేన నేతలు పేర్కొన్నారు. రాజధాని పేరుతో విశాఖ, భోగాపురం సమీపంలోని రైతుల భూములను అక్రమంగా వైఎస్సార్సీపీ నేతలకు కట్టబెట్టే పనికి జవహర్ రెడ్డి పూనుకున్నారని వారు ఆరోపించారు.
ఈ పరిస్థితుల్లో, నీరభ్కుమార్ ప్రసాద్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యే అవకాశం మరింత బలపడింది.
ఇంకా చదవండి: పిన్నెల్లి నివాసం చుట్టుముట్టిన పోలీసులు! ఏ క్షణంలోనైనా అరెస్ట్!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
పదవులు శాశ్వతం కాదు, ఈ గెలుపుతో అత్యుత్సాహం వద్దు! ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం!
టీటీడీ ఈవో ధర్మారెడ్డి పై సీరియస్ ఆరోపణలు! జనసేన నాయకుల ఫిర్యాదు!
ప్రజల్లో ఉత్కంఠ రేపుతున్న మోడీ సర్కార్! టీడీపీకి ఎన్ని శాఖలు ఇవ్వనున్నారు?
అమరావతి: ఏఏజీ పొన్నవోలు రాజీనామా! పొన్నవోలుతో పాటు పబ్లిక్!
ఈ 5 సంవత్సరాలు జగన్ నిద్రపోయాడు అనడానికి మరొక ఉదాహరణ! రాష్ట్రంలో అల్లర్లపై ట్వీట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: