ఓటమి తప్పదని జగన్కి తెలిసిపోయింది
ఐ ప్యాక్ అభినందన సభ క్యాన్సిల్
దుకాణం సర్దేసిన ఐప్యాక్
ఫేక్ క్యాంపెయిన్లు గుట్టు రట్టవుతుందనే భయం
కూటమి ప్రభుత్వం టార్గెట్ కాకూడదని జంప్
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జగన్ టీం, ఐప్యాక్ రుషిరాజ్ సింగ్ కంపెనీ అన్నీ అనుకున్నట్టు జరిగితే రేపు ఐప్యాక్ కార్యాలయంలో 2వ అంతస్తులో జగన్ ముందస్తు విజయోత్సవ సంబరాలకి అంతా సిద్ధం చేశారు. పోలింగ్ ఉదయం నుంచే వేవ్ తాడేపల్లి ప్యాలెస్ని తాకింది. అది సాయంత్రానికి సునామీలా చుట్టేసింది. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి బొమ్మ కనబడింది. బెంజ్ సర్కిల్ లోని ఐప్యాక్ కార్యాలయం రెండవ అంతస్తు జగన్ రాక కోసం చేసిన ముస్తాబు ఆగిపోయింది. జగన్ రారని ఐప్యాక్ పెద్దలకు సమాచారం చేరింది. పోలింగ్ అనుకున్నట్టు జరిగి, వైకాపాకి విజయావకాశాలు ఉంటే మొత్తం ఐప్యాక్ బృందానికి 15వ తేదీన ఏర్పాటు చేసిన భారీ పార్టీ కూడా రద్దు చేశారు. రేపు సాయంత్రంలోగా ఐప్యాక్ కోసం పనిచేస్తున్న వాళ్లంతా వాళ్ళకి ఇచ్చిన మొబైల్స్ లాప్టాప్స్, సిమ్ములు, పెన్ డ్రైవ్లు అందజేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఈ నెల జీతం గాని ఇతరత్రా బెనిఫిట్స్ గాని ఇవన్నీ అందజేస్తేనే అని కండీషన్ పెట్టారు. ఎవరి వద్ద అయినా డేటా ఉంచుకున్నా.. ఇచ్చిన గాడ్జెట్లు తిరిగి ఇవ్వకపోయినా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం మారుతుందని తాము చేసిన ఫేక్ క్యాంపెయిన్ల సూత్రధారులు, పాత్రధారులు... ప్రభుత్వం మారితే అప్రూవల్ గా మారిపోయి డేటా ఇచ్చేస్తారని భయపడి చస్తున్నారు ఐప్యాక్ రుషిరాజ్ సింగ్ కంపెనీ పెద్దలు. అందుకే బెనిఫిట్స్ అన్ని ఆపేసి.. డేటా తము ముందే డిలీట్ చేసి క్లియర్ చేసుకోవాలని నోటీసులు ఇచ్చారు. ఐప్యాక్ రిషిరాజ్ సింగ్ బృందానికి పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకున్న ప్యాకేజీల్లో 50 కోట్లు నిలిపేసారని సమాచారం. జగన్ భార్య భారతి కల్పించుకొని.. ఈ మొత్తాన్ని ఇప్పించింది అని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
ఏపీలో పోలింగ్ ముగిసే సమయానికి! 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు రికార్డ్ స్థాయి పోలింగ్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి