రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 65,707 మంది సర్వీస్ ఓటర్లు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,500 మంది ఓటర్లకు అవకాశం... ఓటర్ల సంఖ్య 1,500 దాటితే ఆక్సిరరీ పోలింగ్ కేంద్రం ఏర్పాటు... రాష్ట్రంలో మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఉల్లంఘనలకు సంబంధించి 864 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. సీజ్లకు సంబంధించి 9 వేలు కేసులు నమోదు అయ్యాయి. సీ విజిల్ యాప్ ద్వారా ఇప్పటివరకు 16,345 ఫిర్యాదులు అందాయి.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఫిర్యాదుల్లో 10,403 ఫిర్యాదులు పరిష్కారమయ్యాయి. హింసాత్మక ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా 156 మందికి గాయాలు పాలయ్యారు. రాష్ట్రంలో 150 అంతరాష్ట్ర చెక్పోస్టులు ఉన్నాయి. నోటిఫికేషన్ నుంచి ఇప్పటివరకు రూ.203 కోట్ల సొత్తు సీజ్ చేశాం అన్నారు. రూ.105 కోట్ల విలువైన నగలు, 47 కోట్ల నగదు సీజ్ చేశాం. రూ.28 కోట్ల విలువైన మద్యం, రూ.3.6 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశాం. ఈ ఏడాది మొత్తం రూ.382 కోట్ల విలువైన సొత్తు సీజ్ చేశాం.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
రాష్ట్రంలో 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్రంలో 64 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ జరుగుతుంది. రాష్ట్రంలో 29,897 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్... 14 నియోజకవర్గాల్లో పూర్తిగా వెబ్కాస్టింగ్ చేయాలని పర్యవేక్షకుల సిఫార్సు చేసారు. మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు, ఒంగోలు, ఆళ్లగడ్డ, తిరుపతి, చంద్రగిరి, పుంగనూరు, పీలేరు, విజయవాడ సెంట్రల్, పలమనేరు, రాయచోటి, తంబళ్లపల్లిలో పూర్తి వెబ్కాస్టింగ్ జరగనుంది అని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ఏపీ: ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని పర్యటన షెడ్యూల్! వేమగిరిలో ఏర్పాటు
బోడె ప్రసాద్ ప్రచార యాత్రలో జోగి రమేష్ కుమారుడు! రెచ్చగొట్టిన వైసీపీ కార్యకర్తలు
కాపు సంక్షేమం కోసం 15 వేల కోట్లు! 5 ఎకరాల స్థలం! అగ్రవర్ణ పేదలకు సముచిత స్థానం!
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి