అనంతపురం: పామిడి వద్ద జాతీయ రహదారిపై భారీగా కరెన్సీ పట్టుకున్నారు పోలీసులు. నాలుగు కంటైనర్ల కరెన్సీ... కంటైనర్లో 500 నోట్లు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. కొచ్చి నుంచి హైదరాబాద్ ఆర్బీఐకి నగదు వెళ్తోందన్న అధికారులు... పోలీసులు రికార్డులు పరిశీలిస్తున్నారు. 2 వేల కోట్లు డబ్బు..
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఏపీవ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎన్నికల్లో నగదు, మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎక్కడిక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై గురువారం అనంతపురం జిల్లా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పామిడి మండలం గజరాంపల్లి వద్ద నాలుగు కంటైనర్లలో డబ్బు తరలిస్తూ ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఒక్కో కంటైనర్లో 500 కోట్లు చొప్పున.. 4 కంటైనర్లలో 2 వేల కోట్లు తరలిస్తూ ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి, ఆదాయపన్ను శాఖ అధికారులకు చేరవేశారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
అయితే పోలీసు అధికారుల విచారణలో ఈ డబ్బును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద డిపాజిట్ చేసేందుకు తీసుకెళ్తున్నట్లు తేలింది. సిబ్బంది ద్వారా వివరాలు తెలుసుకున్న పోలీసులు.. రెండు వేల కోట్లను కేరళలోని కొచ్చి నుంచి హైదరాబాద్ తరలిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేసేందుకు ఈ మొత్తాన్ని తీసుకెళ్తున్నట్లు సిబ్బంది పోలీసులకు వివరించారు. అయితే 2 వేలు కోట్లు ఒకేసారి అంటూ చర్చలు సాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
ఏపీ: ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని పర్యటన షెడ్యూల్! వేమగిరిలో ఏర్పాటు
బోడె ప్రసాద్ ప్రచార యాత్రలో జోగి రమేష్ కుమారుడు! రెచ్చగొట్టిన వైసీపీ కార్యకర్తలు
కాపు సంక్షేమం కోసం 15 వేల కోట్లు! 5 ఎకరాల స్థలం! అగ్రవర్ణ పేదలకు సముచిత స్థానం!
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి