ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైసీపీ నేత ఇచ్చిన ఫిర్యాదు పై కోమటి జయరాం స్పందించారు. కోమటి జయరాం తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ టిడిపి లో పనిచేస్తూ ఓటర్లకు డబ్బులు ఇస్తూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయం లో కోమటి జయరాం ఇన్ఫ్లుయెన్సర్ ల గురించి మాట్లాడిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని ఈ కంప్లైంట్ ఇచ్చారు. ఇటీవల సాక్షి పేపర్ లో వచ్చిన న్యూస్ ఆధారంగా కోమటి జయరాం మీడియాతో మాట్లాడడం జరిగింది. టిడిపికి సపోర్ట్ చేసే ఎన్నారై లను వైసిపి టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తుంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ సమావేశంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా మాట్లాడారంటూ వైసీపీ నేత ఏఎస్ఎస్ మూర్తి సీఈఓ కు ఇచ్చిన ఫిర్యాదుతో కోమటి జయరామ్ కు నోటీసులు వచ్చాయి. దీనిపై కోమటి జయరాం వివరణ ఇచ్చారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో ఎన్నారై లతో జరిగిన మీటింగ్ రహస్యంగా జరగలేదు, యూట్యూబ్ లో ప్రసారం కూడా జరిగింది. టిడిపి గెలుపు కోసం అందరూ కృషి చేయాలని కోరారు. టిడిపి కోసం ప్రవాసాంధ్రులు కృషి చేయాల్సిన సమయం ఇది. ప్రభుత్వ సలహాదారులపై తప్పుడు వ్యాఖ్యలు చేశానని, వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గతంలో ఆంధ్రాకు వచ్చిన ఎన్నారైలపై వారు చేసిన వ్యాఖ్యలను, అనైతిక చర్యలను, బెదిరింపులను కూడా దృష్టిలో పెట్టుకోవాలని జయరాం కోరారు. ఎన్నికల కోడ్ ను తను ఎప్పుడూ ఉల్లంఘించలేదని, చట్టానికి ఎప్పుడూ తలవంచుతానని ఆయన వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
ఈవీఎం- వీవీఫ్యాట్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు! అభ్యర్థులు కోరితే ఆ అవకాశం
జగన్ ను ఉతికి ఆరేసిన షర్మిల! ఆంధ్రకు సీఎంగా ఏం పీకావ్! ఆంధ్ర ను అడుక్కునేలా చేసావ్
వివాదంలో కొడాలి నాని నామినేషన్! ఆర్వో నిర్ణయంపై సర్వత ఉత్కంఠ! టీడీపీ నేత తులసి ఫిర్యాదు
మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో లోకేశ్ ప్రచారం! ఇప్పటికే వేల సంఖ్యలో ప్రాణాలు..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి