మే 13న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన అలాగే బిజేపి ఘనవిజయం సాధించిన సందర్భంగా కువైట్ లో విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కువైట్ తెలుగుదేశం దేశం పార్టీ నాయకుడు, గల్ఫ్ ఎంపవర్మెంట్ కో-ఆర్డినేటర్ శ్రీ కుదరవల్లి సుధాకర రావు ఆధ్వర్యములో ఈ వేడుకలను ఫర్వానియా ద్వైహి పాలస్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర రావు మాట్లాడుతూ ఇంత ఘనవిజయాన్ని అందించిన తెలుగు ప్రజలకు ధన్యవాదాలు తెలియచేసారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇప్పటి వరకు ఎన్నారైలు అందరు సోషల్ మీడియాలో ఒక సైకో విద్వంస పాలనకు వ్యతిరేకంగా పోరాడాము. ఈ విజయం తరువాత మనమీద మరింత భాద్యత పెరిగింది అని, కూటమి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వాటిని ప్రజలకు తెలియ చేసే భాద్యత మన ఎన్నారై లమీద వుందని పేర్కొన్నారు. ఈ కార్యకమంలో గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు శ్రీ వెంకట్ కోడూరి, ఎన్నారై టిడిపి కువైట్ అధ్యక్షుడు శ్రీ మద్దిన ఈశ్వర్ నాయుడు, సుంకవల్లి సత్య సాయి బాబా, కట్టా వేణు గోపాల్ స్వామి, సాయి కృష్ణ,కొల్లి ఆంజనేయులు, గాజులపల్లి సుబ్బా రెడ్డి, విసి సుబ్బారెడ్డి, ఈడుపుగంటి దుర్గాప్రసాద్,పిడికిటి శ్రీనివాస్ చౌదరి, చిన్నా రాజు, వంశీ కాపెర్ల, నరేష్, పెంచల్ సన్నపనేని, పెంచల్ రెడ్డి, మద్దిపట్ల శివ, పోలారపు బాబు నాయుడు, శ్రీనివాస్, మరియు జనసేన గల్ఫ్ కన్వీనర్స్ కాంచన శ్రీకాంత్, రామచంద్ర నాయక్. కువైట్ కో-ఆర్డినేటర్స్ బిరడా సూర్యనారాయణ, ఆకుల రాజేష్, ఇమ్మిడిసెట్టి సూర్యనారాయణ, జిలకర్ర మురళీ, దండు వేణు, మొదలగు వారు, అలాగే మహాసేన రాజేష్ రాపాక, బాలకృష్ణ పాల్గొన్నారు. చివరిగా భారీ కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియచేసుకున్నారు. వచ్చిన అతిదులకు పసందైన విందును ఎర్పాటు చేశారు. కార్యక్రమం లో పాల్గొన్న అందరికి ఈశ్వర్ నాయుడు ధన్యవాదాలు తెలియచేసారు.
ఇవి కూడా చదవండి:
జగన్ ఫోటోలు ఆఫీసు నుండి చెత్తకుప్ప లోకి! వెంటనే తొలగించాలి!
ఏంటి ఇది నిజమేనా! రెండు పదవులేనా? మోడీ నిర్ణయం ఏమిటి?
కృష్ణాజిల్లాలో పర్యటించనున్న కొడాలి నాని! రాళ్ళు, చెప్పులతో సిద్ధంగా ప్రజలు!
రామోజీరావు మృతికి సినిమా ఇండస్ట్రి నివాళి! రేపు షూటింగ్ లకు సెలవు!
ఈ నెల 11 న టీడీపీ శాసనసభపక్ష సమావేశం! ఉండవల్లి నివాసంలో!
ప్రజా పక్షపాతి, నిరంతర శ్రామికుడు! అక్షర యోధుడికి కన్నీటి నివాళులు - లోకేష్
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: