పశ్చిమ బెంగాల్ లోని న్యూ జల్పైగురి స్టేషన్కు సమీపంలోని రంగపాణి వద్ద రెండు రైళ్లు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదం అనంతరం సహాయక చర్యలు వేగంగా చేపట్టిన అధికారులు రైలు సేవలను తిరిగి పునరుద్దరించారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఈ లైన్లో రైళ్లు నడిచాయని కతిహార్ డివిజనల్ రైల్వే మేనేజర్ కుమార్ తెలిపారు. ట్రాక్, ఇతర మరమ్మతులను పూర్తి చేశామని చెప్పారు. విద్యుత్ ట్రాక్షన్ స్తంభాలు దెబ్బతినగా సరిచేసినట్టు వెల్లడించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రమాద స్థలాన్ని సందర్శించి ఇది ఈశాన్య ప్రాంతాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే ప్రధాన మార్గం కాబట్టి, వీలైనంత త్వరగా సేవలను పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే అధికారులు సత్వర చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ ఘటనలో మరొకరు మరణించినట్టు రైల్వే శాఖ తెలిపింది. దీంతో ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 10కి చేరుకుంది.
ఇవి కూడా చదవండి:
ఇవాళ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న పవన్కల్యాణ్! పూర్తి షెడ్యూల్ ఇదే!
5 లక్షల విదేశీయులకు పౌరసత్వం ఇవ్వబోతున్న జో బైడెన్! కావలసిన అర్హతలు ఏంటో తెలుసా!
దేశంలో పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు! 3 ఎయిర్ పోర్ట్ ల వద్ద హై అలర్ట్!
బిజేపి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల కౌంటర్! 2014లో మోడీ చేసింది ఏంటి?
షాకింగ్ నిజాలను వెల్లడించిన సైంటిస్టులు! త్వరలో రోజుకు 25 గంటలు!
శ్రీకాకుళం: జిల్లా అధికారులతో బాబాయ్, అబ్బాయ్ భేటీ! జెట్ స్పీడ్ లో పనులు మొదలు!
ఈ 5 ఏళ్ల జగన్ పాలనలో పొలవరాన్ని నాశనం చేశారు! మరో 5 ఏళ్లు పట్టే పరిస్థితి!
మహానంది ఆలయం వద్ద చిరుత కలకలం! భయంతో ప్రజలు!
చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఆయన ఫ్యామిలీ పడ్డ బాధ కళ్లారా చూశా! కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు!
తాజాగా ఈవీఎంల విషయంలో జగన్ రెడ్డి సంచలన ట్వీట్! పదవి పోయి ఉపన్యాసాలు షురూ!
అసోంలో భారీగా పట్టుబడిన డ్రగ్స్! సబ్బు పెట్టెల్లో తరలిస్తూ! వాటి విలువ ఎంతో తెలిస్తే అవాక్కే!
నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై స్పందించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ! ఆసక్తికర ట్వీట్!
అమెరికా: కాలిఫోర్నియాలో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ సంబరాలు! 250 కార్లతో ర్యాలీ!
భారత్ - శ్రీలంక మధ్య రోడ్డు మార్గం రానుందా! ఏంటి ఇది నిజమేనా?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: