ఆంధ్రప్రదేశ్లో మందుబాబులకు గుడ్న్యూస్.. ఇకపై క్యాష్ టెన్షన్ లేకుండా పోయింది. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపుల్లో డిజిటిల్ లావాదేవీలు నిర్వహిస్తోంది. కొన్ని జిల్లాల్లోని షాపుల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని జిల్లాల్లో 70 నుంచి 80శాతం వరకు డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే, కార్డుల ద్వారా వినియోగదారులు చెల్లింపులు జరుపుతున్నారు. కొంతమంది మాత్రం అక్కడక్కడా క్యాష్ తీసుకెళ్లి కొనుగోళ్లు చేస్తున్నారు. గతంలో మద్యం షాపుల్లో కేవలం క్యాష్ ద్వారా చెల్లింపులు జరిగేవి.. డిజిటల్ చెల్లింపులకు అనుమతి లేదు.
ఏపీ ప్రభుత్వంపై కేంద్రానికి కూడా ఫిర్యాదులు అందాయి. డిజిటల్ చెల్లింపులు లేకపోతే.. మద్యం షాపుల్లో నగదు పక్కదారి పడుతోందనేది ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రభుత్వం మొన్నటి వరకు క్యాష్ చెల్లింపుల్ని మాత్రమే అనుమతించింది.. ఇప్పుడు ఉన్నట్టుండి సాయంత్రం వరకు డిజిటల్ చెల్లింపులు.. ఆ తర్వాత క్యాష్ కూడా తీసుకుంటున్నారు. కరోనా తర్వాత డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యం పెరిగింది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ఇలా ఎన్నో డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా చిన్న, చిన్న షాపుల్లో కూడా డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ విధానాన్ని ఏపీలోని మద్యం షాపుల్లో కూడా అమలు చేస్తున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!
విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!
చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!
బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: