ఆడవాళ్లు ఎన్ని రకాల డ్రెస్ లు వేసుకున్నా చీరకట్టులోని అందం ఇంకెందులోనూ కనిపించదని మరోసారి రుజువైంది. భారతీయతను చాటే చీరకట్టు జపాన్ వాసులను ఆకట్టుకుంది. మహి శర్మ అనే కంటెంట్ క్రియేటర్ చీరకట్టుకొని జపాన్ వీధుల్లో నడిచి జపనీయుల మది దోచింది. ఆమె హొయలు పోతూ నడుస్తుంటే ఆడ, మగ.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా స్థానికులంతా నోరెళ్లబెట్టి, కళ్లప్పగించి చూశారు. ఇందుకు సంబంధించిన వీడియోను మహి శర్మ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా అది వెంటనే వైరల్ అయింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆ వీడియోలో మహి శర్మ నీలి రంగుపై తెల్ల చుక్కలతో బంగారు రంగు అంచులున్న చీర ధరించింది. జపాన్ రాజధాని టోక్యోలో ఉన్న ఓ వీధిలో ఫుట్ పాత్ పై ఆమె నడస్తుంటే మరొకరు వీడియో తీశారు. దీంతో అటుగా వెళ్తున్న స్థానికులంతా తల తిప్పి ఆమెను ఆశ్చర్యకరంగా చూస్తుండిపోవడం అందులో కనిపించింది. కొందరు జపాన్ మహిళలైతే ఏకంగా మహి శర్మను ఫొటోలు తీసుకున్నారు. ఈ వీడియోను నెటిజన్లతో షేర్ చేసుకుంటూ మహి శర్మ తన ఆనందాన్ని పంచుకుంది. ‘జపాన్ లో చీరకట్టుకొని నడిచా. అక్కడి వారి స్పందన భలే నవ్వు తెప్పించింది. ఏదో సరదా కోసమని టోక్యో వీధుల్లో చీర కట్టులో తిరుగుదామనుకున్నా. కానీ జపనీయులు నా ఫొటోలు తీసుకుంటారని అస్సలు ఊహించలేదు. వారు అలా చేయడం చూసి అవాక్కయ్యా’ అని మహి శర్మ తెలిపింది.
ఈ వీడియోను పోస్ట్ చేసినప్పటి నుంచి 30 లక్షలకుపైగా వ్యూస్ లభించాయి. చాలా మంది నెటిజన్లు ఆమెను ప్రశంసల్లో ముంచెత్తారు. భారతీయ వస్ర్తధారణ ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తుందన్న విషయాన్ని మహి శర్మ మరోసారి నిరూపించిందంటూ కామెంట్లు చేశారు. అయితే కొందరేమో ఆమె ధరించిన జాకెట్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. చీరకు తగ్గ జాకెట్ అది కాదని పేర్కొన్నారు. అయితే అసలైన భారతీయ సంస్కృతిలో మహిళలు జాకెట్లు ధరించే వారు కాదని కొందరు గుర్తుచేశారు.
ఇవి కూడా చదవండి:
ఎమ్డీహెచ్, ఎవరెస్ట్ మసాలాలకు మరొక బ్యాడ్ న్యూస్! తాజాగా వాటిపై మరో దేశం నిషేధం!
ఓరి దేవుడో! పిల్ల ఏనుగుకు ఇంత సెక్యూరిటీ నా! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో!
ఉప్పును తగ్గిస్తే 25 లక్షల ప్రాణాలు కాపాడొచ్చు! ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన!
అమెరికా: బాధలో ఉన్న H1B వీసాదారులకు ఊరట! ఉద్యోగాలు కోల్పోయిన వారికోసం కొత్త గైడ్ లైన్స్!
సింగపూర్: అదృష్టం అంటే ఇలా ఉండాలి! ఎయిర్ లైన్ చరిత్రలో ఇది అత్యధిక బోనస్!
విజయనగరం: వైసీపీ నేతల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్! అభ్యర్థుల ఆందోళన! నిలదీసిన టీడీపీ నేతలు
ఎన్నికల్లో హింస రీత్యా 12 మంది అధికారులపై ఈసీ వేటు!! వివరాలు ఇవే
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి