ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా నెల రోజులు కావస్తున్న విదేశాల్లో విజయోత్సవ సంబరాలు కొనసాగుతున్నే ఉన్నాయి. తాజాగా ఆస్ట్రేలియా లోని అడిలైడ్ నగరం లో ప్రజా కూటమి విజయోస్తవాలు పేరిట ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముందుగా ఇటీవల మరణించిన అక్షర యోధుడు రామోజీరావు కి ఘనంగా నివాళులు అర్పించి రెండు నిముషాలు పాటు మౌనం పాటించారు. రామోజీరావు లాంటి వ్యక్తి తెలుగువాడిగా పుట్టడం తెలుగు వారు చేసుకున్న అదృష్టం అని కొనియాడారు.తెలుగు నియంత ను నేలకు కరిపించడం కోసం చివరి క్షణం వరకు అక్షర పోరాటం చేసిన యోధుడు చిరస్మరణీయలు రామోజీ రావు అని NRi లు ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు.