ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మహా కూటమి ఘన విజయాన్ని పురస్కరించుకుని మెల్బోర్న్ లో సంబరాలు మిన్నంటాయి. దేశ సార్వత్రిక ఎన్నికలు, మరియు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మహా కూటమి సాధించిన ఘన విజయాన్ని ఘనంగా పురస్కరించుకున్నారు. ఈ వేడుకలు టీడీపీ విజయోత్సవాలు మెల్బోర్న్ టీడీపీ ప్రెసిడెంట్ కిషోర్ బలుసు ఆధ్వర్యంలో జరిగాయి. ముఖ్య అతిధిగా మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు , భారీ సంఖ్యలో అతిధులు పాల్గొన్నారు. ఈ వేడుకలకు దాదాపు 300 మంది హాజరయ్యారు. అభివృద్ధి రహిత పాలన అంతమైన సందర్భంగా, మహాకూటమి నేతృత్వంలో రాష్ట్రం తిరిగి పునరాభివృద్ది చెందాలని సభ ముక్తకంఠంతో ఏకీభవించడం జరిగింది. ఈ ఘనవిజయం తెలుదేశం పార్టీ కార్యకర్తల కఠోర శ్రమ ఫలం, వారి త్యాగాలకు, అధినాయకులు చంద్రబాబు నిరంతర కృషికి, అలుపెరగని పోరాటానికి నిదర్శనమని చెప్పుకొచ్చారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో చంద్రబాబుకు ప్రజలంతా సహకరించాలని ఆకాంక్షించారు. ప్రవాసులు ఆంధ్రరాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలని, విదేశీ ఉద్యోగ కల్పనలలో తమవంతు కృషిచేయాలని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి:
దేశవ్యాప్తంగా ముగిసిన 'నీట్' రీ ఎగ్జామ్! ఎంత మంది హాజరయ్యారో తెలుసా!
UGC - NET పేపర్ లీక్ పై వెలుగులోకి సంచలన విషయాలు! క్లిప్స్ వైరల్!
ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా వైసీపీకి అహంకారం దిగలేదు! విపక్షం రాని సభను ఇప్పుడే చూస్తున్నాం!
బ్రిడ్జి నుంచి వేలాడుతూ రైలు ఇంజెన్కు రిపేర్! లోకోపైలట్ల సాహసం!
అతి త్వరలో అమరావతికి రైల్వే లైన్! భూసేకరణ షురూ!
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం! ఇద్దరు మృతి!
రాష్ట్రాన్ని తన ప్రైవేటు ఎస్టేటులా మార్చుకోవాలని జగన్ ప్రయత్నం! టీడీపీ ఎమ్మెల్యే ఘాటు కౌంటర్!
రుషికొండ ప్యాలెస్ ను తనకు అమ్మాలి అంటూ చంద్రబాబుకు లేఖ! అది రాసింది ఎవరో కాదు!
పేపర్ లీక్ లను అరికట్టేందుకు యోగీ సర్కార్ కొత్త చట్టం! అత్యంత కఠినంగా రూల్స్!
అమెరికా: విమర్శలు ఎదుర్కుంటున్న ట్రంప్ ఎన్నికల ప్రతిపాదన! విద్యార్ధులు మాత్రం ఫుల్ హ్యాపీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: