తెనాలి పట్టణం ఐతానగర్కు చెందిన తాడిబోయిన శ్రీనివాసరావు, జయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు రవితేజ (28) ఎంఎస్ చేయడానికి గతేడాది అమెరికా వెళ్లారు. అక్కడే టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ నగరంలోని ఓ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. రెండో కుమారుడు అజయ్ తేజ ప్రస్తుతం బీటెక్ పూర్తి చేశాడు. ఇండియాలోనే అతడు ఉద్యోగ ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నాడు. కాగా, తండ్రి శ్రీనివాసరావు ఏడేళ్ల కిందట అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి చనపోయిన నాటి నుంచి తల్లి జయలక్ష్మి వ్యవసాయ కూలీగా మారి కుటుంబాన్ని పోషిస్తుంది. అమెరికాలో పై చదువులు చదువుకుని మంచి స్థాయికి చేరాలన్న ఆలోచనతో బ్యాంక్ లోన్ తీసుకొని రవితేజను అక్కడకు పంపారు.
ఇంకా చదవండి: అమెరికాలో మరో విషాదం! ఘోర రోడ్డు ప్రమాదం! ఏపీ విద్యార్ధి...
అయితే ఈ నెల 18న స్థానికంగా ఉన్న ఓ స్విమ్మింగ్ పూల్కు రవితేజ, అతడి స్నేహితుడితో పాటు వెళ్లాడు. అక్కడ ఒక పూల్ 4 అడుగుల లోతు, మరొకటి 8 అడుగుల లోతు ఉన్న క్రమంలో ఇద్దరూ అధిక లోతు ఉన్న పూల్లో ప్రమాదవశాత్తు జారిపడ్డారు. ఈ ఘటనలో రవితేజ స్నేహితుడు బయటకు వచ్చాడు కానీ.. అతడు మాత్రం నీటిలో మునిగిపోయాడు. ఈత రాకపోవటంతో జల సమాధి అయిపోయాడు. పోలీసులు ద్వారా విషయాన్ని తెలుసుకున్న అక్కడి బంధువులు తెనాలిలోని కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేశారు. బంధువులతో పాటు తానా సభ్యులు మృతదేహాన్ని స్వస్థలం తెనాలికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కుమారుడి మరణవార్త తెలిసి తల్లి జయలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బిడ్డ మృతదేహాన్ని త్వరగా తన వద్దకు చేర్చండయ్యా..అంటూ ఆమె గుండెలవిసేలా రోధిస్తున్నారు.
ఇంకా చదవండి: ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే ఆ పథకాలకు నో ఎంట్రీ! కార్డు లేనివారికి, ఏపీలో ప్రత్యేక డ్రైవ్!
మృత దేహాన్ని తరలించడానికి NRI TDP Cell, TANA team square n APNRT కోఆర్డినటింగ్ చేస్తున్నారు. అన్ని డాక్యుమెంట్స్ ఫార్మాలిటీస్ పూర్తి అయిన తరువాత దేహాన్ని వారి స్వస్థలానికి పంపుతారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సినీనటి పై పోలీసు కేసు! అసలు ఆమె ఏమి చేసిందంటే?
శవ రాజకీయాలు చేయడం జగన్ పద్ధతి! 151 నుంచి 11 స్థానాలకు పడిపోయిన సైకో!
ఒమన్: భారత ఎంబసీ నిద్రపోతుందా? పార్కుల్లో, బీచుల్లో నివాసం ఉంటున్న తెలుగు ఆడవాళ్లను పట్టించుకోదా...
సౌదీలో మరో తెలుగు వ్యక్తి అనుభవిస్తున్న నరకం! స్పందించిన మంత్రి లోకేష్!
రొట్టెల పండుగ నేపథ్యంలో భక్తులకు శుభవార్త! రూ.5 కోట్లు మంజూరు చేసిన సీఎం!
రాత్రి పడుకునే ముందు ఈ పనిచేస్తే ఆరోగ్యమస్తు! అరే చిన్న చిట్కా చేస్తే పోలా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: