డల్లాస్లో తెలుగు విద్యార్థిపై కాల్పులు జరిగిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని బాపట్లకు చెందిన 32 ఏళ్ల గోపీ కృష్ణ దాసరి స్టోర్ క్లర్క్ గా పని చేస్తున్నాడు. అతడిపై కాల్పులు జరిపిన కేసులో 21 ఏళ్ల దావొంట మాథిస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూన్ 22, శనివారం నాడు ప్లెజెంట్ గ్రోవ్లోని కన్వీనియన్స్ స్టోర్ లోకి మాథిస్ స్టోర్లోకి ప్రవేశించడం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ రికార్డింగ్ ప్రకారం నిందితుడు కౌంటర్ వద్ద ఉన్న గోపి కృష్ణ దాసరి వద్దకు చేరుకొని, అతడిపై అనేక సార్లు కాల్పులు జరిపడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటన స్థలం నుండి పారిపోయే ముందు మాథిస్ స్టోర్ నుండి వస్తువులను దొంగిలించాడని, సాక్షులు తుపాకీ కాల్పులు విన్నారని తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గాయల పాలైన గోపి ఆసుపత్రిలో 18 గంటలకు పైగా ప్రాణాలతో పోరాడి మరణించాడు. ఈ సంఘటనకు సంబందించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేరస్థుడిని పట్టుకున్నారు. అయితే నిందితుడు మాథిస్ వారంలోనే రెండు నేరాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతను కొద్ది రోజుల క్రితం మెస్క్వైట్లో మరో స్టోర్ క్లర్క్, 60 ఏళ్ల ముహమ్మద్ హుస్సేనన్ను కాల్చి చంపిన కేసులో కూడా నిందితుడాగా ఉన్నాడు. రెండు సందర్భాల్లో, మాథిస్ దుకాణాల్లోకి ప్రవేశించడం, క్లర్లపై కాల్పులు జరపడం మరియు పారిపోయే ముందు వస్తువులను దొంగిలించడానికి ప్రయత్నించినట్లు పోలీసులు కనుగొన్నారు. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
ఇవి కూడా చదవండి:
రైతు భరోసా పథకం పేరు మార్చిన ఏపీ సర్కార్! కొత్త పేరు అదే!
క్రీడల్లో రాజీకీయ జోక్యం ఉండకూడదు! క్రికెటర్ హనుమ విహారికి అండగా ఉంటానన్న లోకేష్!
అమెరికాను వీడని వరద ముప్పు! ప్రవాహానికి బద్దలైన డ్యామ్!
ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు దక్కని ఊరట! కొనసాగానున్న స్టే!
షాకింగ్ న్యూస్! పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ సమీపంలో మహిళ ఆత్మహత్యాయత్నం! కారణం అదే!
జగన్ బ్రో సైకోఇజం ముందు కిమ్ కూడా పనికిరాడు! గంటా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు!
‘యువగళం’ చానల్తో టీడీపీకి ఎలాంటి సంబంధమూ లేదు! త్వరలోనే చర్యలు ఉంటాయని హెచ్చరిక!
మీ ఐఆర్సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్లు బుక్ చేస్తే జైలుకే! తస్మాత్ జాగ్రత్త!
ఆస్ట్రేలియా: మెల్బోర్న్ లో ఘనంగా కూటమి విజయోత్సవ సంబరాలు! ముఖ్య అతిధిగా మాజీ మంత్రివర్యులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: