ఇటీవల కాలంలో భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోతుంది. చిన్న పరిశ్రమ నుంచి భారీ తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరుకుంది. ఇందులో ముఖ్యంగా భారత జనరిక్ మెడిసిన్ తయారు చేస్తూ, మన దేశంలోని అన్ని రాష్ట్రాలకు అందుబాటులో ఉంచడమే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాలకు ఎగుమతులు చేస్తుంది. ఇందులో భాగంగానే తక్కువ ధరకు జనరిక్ మందుల సరఫరాలో భారతీయ కంపెనీలు అమెరికాలో బాగా రాణిస్తున్నాయి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2022 సంవత్సరంలో అమెరికాలో రోగులు వినియోగించిన మొత్తం జనరిక్ మందులలో లో 47 శాతం భారత్ కు చెందిన కంపెనీలు తయారు చేసినవే ఉన్నట్లు నివేదికలు వెల్లడించాను. ముఖ్యంగా మానసిక రుగ్మతలు, హైపర్ టెన్షన్, లిపిడ్ రెగ్యులేటర్స్, యాంటీ అల్సర్, డయాబెటిస్ వంటి వ్యాదులకు సంబంధించిన మందులు ఎక్కువగా అమెరికన్లు వాడుతున్నారు. దీంతో 2022లో యూఎస్ హెల్త్ డిపార్ట్మెంట్ 216 బిలియన్ డాలర్లను ఆదా చేయగలిగింది. అలాగే 2013 నుంచి 2022 మధ్య కాలంలో ఏకంగా 1.3 ట్రిలియన్ డాలర్లను పొదుపు చేసినట్లు నివేదికలు తెలిపాయి. దీంతో భారత్ లో తయారైన జనరిక్ మందులకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కిందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
యూరోప్ ప్రయాణికులకు పెద్ద షాక్! పెరిగిపోతున్న స్కెంజన్ వీసా ధరలు! ఎంత పెంపు అంటే!
ధోనీ రిటైర్మెంట్ పై సీఎస్కే ఏం చెబుతుంది! ధోనీ ఆఖరి ఐపీఎల్ ఇదేనా! చదివేయండి!
బేబీ బంప్ తో దీపికా పదుకొనే! ఎంత క్యూట్ గా ఉందో! ఒక లుక్ వేయండి!
అమెరికాలో అరుదైన గౌరవం దక్కించుకున్న తెలుగు మహిళ! కాలిఫోర్నియాలో మొట్టమొదటి సారిగా! ఎవరు ఆమె!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి