అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు మహిళ జయ బాడిగకు అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంట్ కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా ఆమె నియమితులయ్యారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి కాలిఫోర్నియాలో జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా నిలిచారు. 2022 నుంచి ఇదే కోర్టులో కమీషనర్గా కొనసాగుతున్నారు. ఈమె మాజీ మచిలీపట్నం పార్లమెంటరీ సభ్యులు బాడిగ రామకృష్ణ గారి కుమార్తె కావడం విశేషం.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఏపీలోని విజయవాడకు చెందిన జయ బాడిగ, హైదరాబాద్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం అమెరికా వెళ్లిన ఆమె బోస్టన్ విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తి చేశారు. ఆ తర్వాత శాంటా క్లారా విశ్వవిద్యాలయం నుంచి లా పట్టా అందుకున్నారు. 2009లో కాలిఫోర్నియా స్టేట్ బార్ ఎగ్జామ్ క్లియర్ చేశారు. 10 ఏళ్లకు పైగా న్యాయవాద వృత్తిలో ప్రైవేట్ ప్రాక్టీస్లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో లాభాపేక్ష లేకుండా పలు కేసుల్లో ప్రభుత్వం తరఫున వాదించారామె. అలాగే మెక్జార్జ్ స్కూల్ ఆఫ్ లాలో అధ్యాపకురాలిగాను పని చేశారు.
ఇవి కూడా చదవండి:
ధోనీ రిటైర్మెంట్ పై సీఎస్కే ఏం చెబుతుంది! ధోనీ ఆఖరి ఐపీఎల్ ఇదేనా! చదివేయండి!
బేబీ బంప్ తో దీపికా పదుకొనే! ఎంత క్యూట్ గా ఉందో! ఒక లుక్ వేయండి!
బ్రిటన్ లో ఆర్ధిక సంక్షోభం... కానీ! భారీగా పెరిగిన రిషి సునాక్ ఆస్తులు! కారణం ఏమిటి!
'బెంగళూరు రేవ్ పార్టీతో నాకేం సంబంధంలేదు'! కన్నడ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మొద్దు! హేమ వ్యాఖ్యలు!
ఐర్లాండ్ వెళ్ళాలి అనుకునే వారికి శుభవార్త! వర్క్ మరియు డిపెండెంట్ వీసాలు సులభతరం! ఆకర్షణీయమైన పథకాలు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి