గిరిబాబు తనయుడు రఘుబాబు మంచి కమెడియన్ అని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. తాజాగా 'హిట్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. " మా సొంత బ్యానర్ పై నాన్న సినిమాలు నిర్మిస్తూ ఉండేవారు. 1990లో తమ్ముడు హీరోగా 'ఇంద్రజిత్' సినిమాను నిర్మించాము. అప్పట్లోనే ఆ సినిమా కోసం 50 లక్షలు ఖర్చుపెట్టాము. సినిమా బాగానే ఆడింది .. కానీ డబ్బులు మా వరకూ రాలేదు" అని అన్నారు. ''నిజానికి ఆ సినిమాను రిలీజ్ చేయడం కోసమే నాన్న చాలా ఇబ్బందులు పడ్డారు. రిలీజ్ చేసిన తరువాత చూస్తే మాకు చాలా పెద్ద మొత్తంలో నష్టాలు వచ్చాయి. నిజానికి సినిమా బయటపడిపోయిన తరువాత ఎవరూ ఎవరినీ పట్టించుకోరు. కానీ నాన్న గారు అలా కాదు, మాకు రూపాయి రావలసి ఉంది అంటూ ఎవరూ గేటు ముందుకు రాకూడదనేది ఆయన పద్ధతి" అని చెప్పారు. 'ఇంద్రజిత్' సినిమా కారణంగా వచ్చిన నష్టాలను పూడ్చడం కోసం, నాన్నగారు స్థిరాస్తులను అమ్మేశారు. ఆయన 20 - 25 సంవత్సరాలుగా సంపాదించిందంతా పోయింది. కాలం కలిసొస్తే మళ్లీ సంపాదించుకుందాం .. లేదంటే ఊరు వెళ్లిపోదామని నాన్న చెప్పాడు. అలా ఎన్నో ఇబ్బందులను తట్టుకుని నిలబడటం జరిగింది" అని చెప్పారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైజాగ్ లో 5 ఎకరాలలో అద్భుతమైన మాల్ నిర్మాణం! నగరానికి మణిపూస కానున్న కట్టడాలు! ప్రభుత్వం తరపు నుండి!
జూబెర్ వీడియోలో మెహరున్నీసా ఆచూకీ! నారా లోకేష్ సహాయంతో సౌదీ అధికారులతో చర్చలు!
కుప్పం వైసీపీ కార్యాలయం మూసివేత! MLA భరత్ కనబడకపోవడం పార్టీకి పెద్ద దెబ్బ!
ఏపీలో మరోసారి ఎన్నికలు! ఆ మూడు జిల్లాల్లో కోడ్ అమలులోకి! పోలింగ్ ఎప్పుడంటే!
ఏపీలో వాలంటీర్లకు శుభవార్త! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!
కుప్పంలో వైసీపీకి భారీ షాక్! టిడిపి లోకి 15 మంది ఎంపీటీసీలు, ఐదుగురు కౌన్సిలర్లు!
సాక్షి కథనాలపై సైకో ఆగ్రహం! వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను బయట పెట్టిన వార్తలు!
పిన్నెల్లికి బిగ్ షాక్! బెయిల్ పిటీషన్ కొట్టివేత!
ఏపీకి మరో రూ.75వేల కోట్ల పెట్టుబడి! కంపెనీ పేరు ఇప్పుడే చెప్పను! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: