మెసేజ్ ఓపెన్ చేయగానే 92 వేల రూపాయలు బ్యాంకు ఖాతా నుంచి కట్ అయిన కథ ఇది. మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని వీణ కంగన్ హాల్ యజమాని శేషగాని శ్రీనివాస్ బ్యాంక్ అకౌంట్ నుండి సైబర్ కేటుగాళ్లు 92 రూపాయలు కాజేశారు. గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో వరుసగా మెసేజ్ వస్తుండడంతో ఏమిటా అని మెసేజ్లను ఓపెన్ చేయగా 8 గంటల ప్రాంతంలో 60,000 మరోసారి 32,000 నగదు ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నుండి 97158008352 నెంబర్ కి ట్రాన్స్ఫర్ అయ్యాయని బాధితుడు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సైబర్ క్రైమ్ నెంబర్(1930) కి కాల్ చేసి సంబంధిత ఆధారాలు వాట్సాప్ ద్వారా అందజేశామని అందజేసిన స్క్రీన్ షాట్స్ కూడా వాటంతట అవే ఫార్వర్డ్ అవుతున్నాయన్నారు. తాను ఎటువంటి ఓటీపీలు చెప్పడం కానీ లింకులు ఓపెన్ చేయడం కానీ చేయలేదని, పోయిన నగదు తిరిగి అకౌంట్ లో జమ అవుతుందో లేదో అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఉదయం టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. సైబర్ నేరగాళ్లు ఫోన్ హ్యాక్ చేసి ఉండవచ్చు అని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రాజధాని ప్రజలకు మరో గుడ్ న్యూస్! అమరావతిని అనుసంధానిస్తూ రూ.2,047 కోట్లతో రైల్వే ప్రాజెక్టు!
వైసీపీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం! తాజాగా మరో ఎమ్మెల్యే!
ఢిల్లీలో జగన్ ఆధ్వర్యంలో వైసీపీ ధర్నా! గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారనివ్యాఖ్యలు!
కక్షసాధింపు ఆలోచన లేదంటున్న టీడీపీ! రాష్ట్రంలో సమస్యలు గుర్తించి సూచనలు!
రాత్రిపూట పెరుగన్నం తింటున్నారా? తింటే వచ్చే సమస్యలివే! ముఖ్యంగా వీరికి అస్సలు మంచిది కాదు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: