ప్రముఖ టెలికాం కంపెనీ జియోను బైకాట్ చేసి ప్రభుత్వ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ కి మారాలని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలు అయిన జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాలు తమ టారిఫ్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ టెలికాం కంపెనీల వినియోగదారులకు ఈ నెల నుంచి అదనపు భారం పడనుంది. టెలికాం సంస్థలు తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రైవేట్ టెలికం సంస్థలు ఇష్టానుసారంగా టారిఫ్ రేట్లను పెంచుతున్నాయని, ఇలా అయితే సామాన్యుడు టెలికాం సేవలను ఎలా వినియోగించుకోగలడు అని నెట్టింట ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక మరోవైపు 5జీ సేవలపై పెట్టిన నిబంధనలకు జియో సంస్థపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జియోను బైకాట్ చేయాలని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ కు మారాలని సూచిస్తున్నారు. ప్రైవేట్ టెలికాం సంస్థలు టారిఫ్ రేట్లను పెంచుతున్నందున బీఎస్ఎన్ఎల్ సేవలు మరింత మెరుగు పరచాలని.. ఈ సమయాన్ని ఒక అవకాశంగా తీసుకోవాలని నెటిజన్లు ప్రభుత్వాన్ని సూచిస్తున్నారు.
ఇంకా చదవండి: జనసేనాని కొన్న మూడు ఎకరాల భూమి ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ఎందుకు కొన్నారంటే!
ఈ సందర్భంగా బాయ్కాట్ జియో అనే హ్యాష్ టాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. టెలికాం కంపెనీలపై జియో ఆధిపత్యం పూర్తిగా పోయేలా.. బీఎస్ఎన్ఎల్ ను ట్రెండింగ్ లోకి తీసుకొని రావాలని తెగ పోస్టులు పెడుతున్నారు. అంతేగాక జియో, అంబానీలకు సంబందించిన మీమ్స్ ను నెట్టింట షేర్ చేస్తున్నారు. దీనిపై స్పందిస్తున్న కొందరు నెటిజన్లు మేము జియో నుంచి బీఎస్ఎన్ఎల్ కు మారామని చెబుతూ.. దానికి సంబందించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
గోవా వెళ్లాలనుకునే టూరిస్టులకు సూపర్ న్యూస్! ఇకపై సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు!
కేరళను కలవరపెడుతున్న అరుదైన ఇన్ఫెక్షన్! ఇప్పటికే ముగ్గురు మృతి!
తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు హత్య కేసులో 8 మంది అరెస్ట్! వెలుగులోకి కొత్త నిజాలు!
మీడియా ముందు ప్రత్యక్షమైన భోలే బాబా! హత్రాస్ ఘటనపై ఏమన్నారంటే!
ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దుర్గమ్మ ఆషాడ ఉత్సవాలు! 16 వరకూ వారాహి నవరాత్రులు!
తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ దారుణ హత్య! ఫుడ్ డెలివరీ ఏజెంట్స్గా వచ్చి దాడి!
చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీలో అంత ముఖ్యమైన టాపిక్ పై నో డిస్కషన్! ఎందుకంటే!
లిక్కర్ కేసులో కవితకు బెయిల్ కోసం కీలక నిర్ణయం! రంగంలోకి KTR, హరీష్ రావు!
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! అతి త్వరలో విజయవాడ నుండి కుర్నూల్ కు సర్వీసులు ప్రారంభం!
రేవంత్ రెడ్డితో భేటీపై స్పందించిన చంద్రబాబు! ఏమన్నారంటే!
వచ్చే నెల వరకూ సాగునీరు లేనట్టే! కృష్ణా డెల్టా రైతులకు బిగ్ షాక్!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! రూ. 60 వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ! త్వరలోనే అధికారిక ప్రకటన!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: