కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తుంటారు. శ్రీవారిని దర్శించుకుని తరిస్తూ ఉంటారు. అలా వచ్చే వేలాదిమంది భక్తులు స్వామి వారి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అన్న ప్రసాదాన్ని స్వీకరించి.. స్వామి వారి కృపకు పాత్రులవుతూ ఉంటారు. అయితే శ్రీవారి అన్న ప్రసాదం తయారీ విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నప్రసాదం నాణ్యతపై భక్తుల నుంచి గత కొన్ని రోజులుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అన్న ప్రసాదం తయారీలో సేంద్రీయ బియ్యం వాడకాన్ని ఆపివేయాలని నిర్ణయించింది. సేంద్రీయ బియ్యం వాడకాన్ని నిలిపివేసి.. అన్న ప్రసాదం తయారీకి గతంలో వాడిన బియ్యాన్నే వినియోగించాలని నిర్ణయించింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వీటితో పాటుగా అన్నప్రసాదాల దిట్టం కూడా పెంచాలని టీటీడీ నిర్ణయించింది, కొవిడ్ సమయంలో అన్న ప్రసాదాల దిట్టంను తగ్గించారు. అయితే ఆలయ అర్చకులు, ఆగమ పండితులతో టీటీడీ ఈవో జె. శ్యామలరావు ఇటీవల సమావేశమయ్యారు. శ్రీవారి ఆలయానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు, వైఖానస ఆగమోపచారాలు, పలు అంశాలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగానే కరోనా సమయంలో తగ్గించిన ప్రసాదం దిట్టంను పెంచాలని వారు సూచించారు. ఈ నేపథ్యంలోనే అన్న ప్రసాద దిట్టంను పెంచాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.
ఇంకా చదవండి : హిందువులకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి! ఎంపీ పురందేశ్వరి ఫైర్!
మరోవైపు టీటీడీ ఈవోతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆలయ అర్చకులు, పండితులు పలు సూచనలు చేశారు, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలోని వేద విద్యార్థులకు అప్రెంటీస్గా అవకాశం కల్పించాలని కోరారు. అలాగే ప్రతి సోమవారం ఆర్జిత సేవగా నిర్వహించే విశేష సేవను.. ఏడాదిలో ఒక్కసారైనా నిర్వహించాలని టీటీడీ ఈవోను కోరారు. అంతకుముందు తిరుమలలో పారిశుద్ధ్యంపైనా టీటీడీ ఈవో సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి:
విశాఖ సెంట్రల్ జైలులో హోంమంత్రి వంగలపూడి అనిత తనిఖీలు! గంజాయి కేసులో ఏకంగా 1200 మంది అరెస్ట్!
ఏపీలో పెన్షన్ ఒక్క నెల తీసుకోకపోయినా రద్దు అవుతుందా? చంద్రబాబు కీలక ప్రకటన!
జులై నెలలో తిరుమలకు వెళుతున్నారా! అయితే ఈ వివరాలు తెలుసుకోండి!
ఈ నెల 6 న తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ సీన్! భేటీకి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్!
వైసీపీ ఓటమికి ముఖ్య కారణం అదే! కీలక విషయాలు బయటపెట్టిన CPI నారాయణ!
బస్సులో సీటు కోసం 11 లక్షలు పోగొట్టుకున్నాడు! ఎలాగో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
జగన్ రెడ్డికి మరో షాక్ ఇచ్చేందుకు వ్యూహం రెడీ! ముహూర్తం ఫిక్స్ చేసిన చంద్రబాబు!
ఏపీకి మరో నాలుగు రోజులపాటు వర్ష సూచన! వతావరణ శాఖ హెచ్చరిక!
జీతం తీసుకోను... ఫర్నీచర్ కూడా నేనే తెచ్చుకుంటా! డిప్యూటీ సీఎం సంచలన నిర్ణయం!
ప్రజా నాయకుడికి, పరదాల నాయకుడికి తేడా ఏంటో ప్రజలకు తెలిసింది! మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
హిందూ సమాజం అంటే ఒక్క మోడీ మాత్రమే కాదు! ప్రధానిపై రాహుల్ గాంధీ ఫైర్!
వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! ఉంచుతారా... తొలగిస్తారా?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: