సెంట్రల్ రైల్వేలోని పంచవతి ఎక్స్ ప్రెస్ రైలు రెండు బాగాలుగా విడిపోయి కొద్దిదూరం వేగంగా ప్రయాణించింది. మహారాష్ట్రలోని థానే జిల్లా కళ్యాణ్ స్టేషన్ సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మన్మాడ్ నుంచి ముంబై వెళ్లవలిసిన పంచవతి ఎక్స్ ప్రెస్ మన్మాడ్ ప్రాంతం నుంచి బయలుదేరి దాదాపు 300 కిలో మీటర్లు ప్రయాణించింది. కళ్యాణ్ స్టేషన్ వద్దకు చేరుకోగానే భోగీలకు ఉండే కప్లింగ్ విరిగిపోవడంతో రైలు ఇంజన్, దాని మూడు కోచ్ లతో.. మిగిలిన 12 భోగీలు వేరుచేయబడి కొద్ది దూరం పాటు వేగంగా ప్రయాణించాయి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
దీంతో ప్రయాణికులు ఒక్క సారిగా భయాందోళనకు గురయ్యారు. అనంతరం అప్రమత్తమైన సిబ్బంది.. వదిలివేసిన కోచ్ లను మళ్లీ తిరిగి అతికించి తమ ప్రయాణాన్ని పున:ప్రారంభించింది. ఈ ఘటనతో సబర్మన్, సుదూర రైళ్లు కొంత ఆలస్యం అయ్యాయని, ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. రైలు ఎంత దూరం ప్రయాణించింది ఇంకా నిర్ధారణ కాలేదని, దీనికి దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తామని సెంట్రల్ రైల్వే ముఖ్య అధికారి సునీల్ ఉదాసి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
బాయ్కాట్ జియో... పోర్ట్ టు బీఎస్ఎన్ఎల్! సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్!
గోవా వెళ్లాలనుకునే టూరిస్టులకు సూపర్ న్యూస్! ఇకపై సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు!
కేరళను కలవరపెడుతున్న అరుదైన ఇన్ఫెక్షన్! ఇప్పటికే ముగ్గురు మృతి!
తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు హత్య కేసులో 8 మంది అరెస్ట్! వెలుగులోకి కొత్త నిజాలు!
మీడియా ముందు ప్రత్యక్షమైన భోలే బాబా! హత్రాస్ ఘటనపై ఏమన్నారంటే!
ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దుర్గమ్మ ఆషాడ ఉత్సవాలు! 16 వరకూ వారాహి నవరాత్రులు!
తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ దారుణ హత్య! ఫుడ్ డెలివరీ ఏజెంట్స్గా వచ్చి దాడి!
చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీలో అంత ముఖ్యమైన టాపిక్ పై నో డిస్కషన్! ఎందుకంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: