దేశంలో వాతావరణ పరిస్థితులు విచిత్రంగా మారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతుంటే, మరికొన్ని ప్రాంతాల్లో హీట్వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో కొన్నిచోట్ల వేడి తాకిడి తీవ్రంగా ఉండవచ్చని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. జూన్ 22 నుంచి జూన్ 25 వరకు పశ్చిమ ఉత్తరప్రదేశ్లో హీట్వేవ్ తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. జూన్ 24, 25 తేదీల్లో పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ ప్రాంతాల్లో కూడా హీట్వేవ్ పరిస్థితులు చోటుచేసుకోవచ్చని IMD తెలిపింది. ఈ తేదీల తర్వాత వేడి తగ్గుముఖం పడుతుందని సూచించింది.
ఇతర ప్రాంతాల్లో, తెలుగు రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని IMD పేర్కొంది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల జాబితాను విడుదల చేసింది. గోవా, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, బీహార్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లో కూడా భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇంకా చదవండి: వన్ప్లస్ నుంచి తొలి పవర్ బ్యాంక్ రాబోతోంది! LAPTOP లు కూడా ఛార్జ్ చేస్కోవచ్చు! మార్కెట్లోకి లాంచ్ ఎప్పుడంటే!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
BoAt Airdopes 131 Elite ANC లాంచ్! టాప్ ఫీచర్లు, ధర మరియు లభ్యత వివరాలు!
జగ్గయ్యపేటలో రాత్రంతా అధికారుల అలర్ట్! అసలు కారణం ఇదే!
చంద్రబాబు స్పెషల్ టీం 19 IAS లు! శ్రీలక్ష్మి కి మొండి చెయ్యి! ఆ నలుగురికి శిక్ష తప్పదా!
మీ వద్ద తెల్ల రేషన్ కార్డు ఉందా! కేంద్రప్రభుత్వ పథకాలన్నీ ఉపయోగించుకుంటున్నారా?
తాగుబోతులకు గుడ్ న్యూస్! నాసిరకం జేబ్రాండ్లపై బ్యాన్, మద్యం ధరలు తగ్గిస్తామన్న మంత్రి ప్రకటన!
జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: