సింగపూర్‌ వర్క్ పర్మిట్‌ అప్‌డేట్‌... ఉద్యోగ కాల పరిమితి రద్దు, వేతనాలు పెంపు పూర్తి సమాచారం మీ కొరకు!!

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో హైవే పనులు చురుగ్గా జరుగుతున్నాయి. చిత్తూరు ప్రాంతం దక్షిణ భారత వ్యాపార మార్గాలకు కీలక కేంద్రంగా ఉండటంతో, ఇక్కడి రహదారులను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దే ప్రయత్నం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ అనుమతులతో నిర్మాణం ప్రారంభమైన ఈ రహదారులు త్వరలోనే ప్రజల వినియోగానికి అందుబాటులోకి రానున్నాయి.

పాన్‌ కార్డు–ఆధార్‌ లింకింగ్‌పై కొత్త నిబంధనలు! ఆదాయపన్ను శాఖ సర్క్యులర్‌ విడుదల

ప్రస్తుతం చిత్తూరు–తచ్చూరు మధ్య ఆరు లైన్ జాతీయ రహదారి నిర్మాణం 90 శాతం పూర్తయింది. మొత్తం 161.1 కి.మీ పొడవుతో రూ.3,197 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం సాగుతోంది. ఈ హైవే ద్వారా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సరకు నేరుగా పోర్టుల వరకు తరలించడానికి సులువైన మార్గం ఏర్పడుతుంది. ఇది బెంగళూరు–చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవేతో అనుసంధానమవుతోంది. చిత్తూరు కీనాటంపల్లి నుంచి తమిళనాడులోని తచ్చూర్ వరకు ఈ యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణం దేశంలో అత్యాధునిక సాంకేతికతతో జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, ఆ ప్రాంతంలో పారిశ్రామిక విస్తరణకు పెద్ద పునాది పడనుంది.

భారత రైల్వేల మరో అద్భుతం.. త్వరలో వందేభారత్ 4.0 రాబోతోంది! గంటకు 350 కి.మీ. వేగంతో.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన!

ఇక మరోవైపు, హోస్‌కోటె–శ్రీపెరంబదూర్ ఎక్స్‌ప్రెస్ వే పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ఈ రహదారి మొత్తం పొడవు 262 కి.మీ, మరియు 80 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. రూ.4 వేల కోట్లతో నిర్మిస్తున్న ఈ హైవే ద్వారా బెంగళూరు–చెన్నై ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ప్రస్తుతం చిత్తూరు నుంచి చెన్నై లేదా బెంగళూరు వెళ్లడానికి సగటున 3.5 గంటల సమయం పడుతుండగా, ఎక్స్‌ప్రెస్ వే పూర్తయితే అది కేవలం 2 గంటల్లోపుకి తగ్గనుంది. ఈ హైవే ప్రారంభమైతే చిత్తూరు పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు.

OnePlus ఫ్యాన్స్‌కు దీపావళి బంపర్ ఆఫర్! కేవలం ₹15,499కే Nord CE4 Lite 5G... పూర్తి ఫీచర్లు ఇవే!

ఈ రహదారి అభివృద్ధితో చిత్తూరు, కుప్పం, పుత్తూరు వంటి పట్టణాలు కొత్త రీతిలో రూపుదిద్దుకోనున్నాయి. రోడ్ల వల్ల సరకు రవాణా సులభతరం అవడంతో, ఎగుమతి దిగుమతి రంగాలకు కూడా ఊపిరి అందుతుంది. ఇదే సమయంలో, ప్రధానమంత్రి మోదీ పర్యటన నేపథ్యంలో కేంద్రం నుండి ఏపీకి మరో శుభవార్త కూడా రానుంది. జాతీయ రహదారుల విస్తరణకు మరిన్ని ప్రాజెక్టులకు ఆమోదం లభించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్ర రవాణా వ్యవస్థలో నూతన యుగం ప్రారంభమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

Karnataka: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్..! ఇకపై ఆ మార్కులు వచ్చినా పాస్..! కర్ణాటక విద్యాశాఖ కీలక నిర్ణయం..!
దాదాపు 50 చిత్రాల్లో నటించిన స్టార్ హీరోయిన్ కి కష్టాలు! తీవ్ర మానసిక ఒత్తిడిలో - అసలు కారణం ఇదేనా?
Bigboss: తెలుగు బిగ్ బాస్ షో పై మళ్ళీ పిర్యాదు..! రంగంలోకి పోలీసులు..! కారణం ఏమిటంటే..!
భారీ జీతంతో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో జాబ్స్ నవంబర్ 14 చివరి తేదీ.. పూర్తి వివరాలు ఇవే!
వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ముఖ్యమైన అప్‌డేట్‌లను మిస్ అవ్వకుండా.! మెటా కొత్త అప్‌డేట్!
పెద్ది పై బుచ్చిబాబు బిగ్ అప్‌డేట్.. చరణ్ ఫ్యాన్స్‌కు దీపావళి గిఫ్ట్ రెడీ!