Lineman Recruitment: నాణ్యమైన విద్యుత్ సరఫరాపై ప్రభుత్వం ఫోకస్.. లైన్‌మెన్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్.!! RRB Jobs: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. RRB ALP 2026-27 నోటిఫికేషన్ విడుదల! Railway Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! రాత పరీక్ష లేకుండానే రైల్వేలో ఉద్యోగం...! Nursing Jobs: భారీ జీతంతో ఎయిమ్స్ లో ఉద్యోగం..! ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల వివరాలు...! SBI Recruitment: నిరుద్యోగులకు అదిరిపోయే వార్త! SBI స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల! Scientist Jobs: నెలకు రూ.2 లక్షల జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు..! ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం! SBI Recruitment: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..! ఎస్‌బీఐలో భారీ ఖాళీలు.. ఇప్పుడే అప్లై చేయండి! Indian Navy: ఇండియన్ నేవీలో భారీ నోటిఫికేషన్...! పరీక్ష లేకుండా ఇండియన్ నేవీ ఆఫీసర్ హోదా...! SSC Latest Update: నిరుద్యోగులకు అలర్ట్! కానిస్టేబుల్ పోస్టుల రాత పరీక్షల షెడ్యూల్ మార్పు...! RBI Jobs: నెలకు 60 వేల జీతంతో రిజర్వ్ బ్యాంక్ జాబ్స్...! ఇప్పుడే అప్లై చేయండి! Lineman Recruitment: నాణ్యమైన విద్యుత్ సరఫరాపై ప్రభుత్వం ఫోకస్.. లైన్‌మెన్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్.!! RRB Jobs: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. RRB ALP 2026-27 నోటిఫికేషన్ విడుదల! Railway Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! రాత పరీక్ష లేకుండానే రైల్వేలో ఉద్యోగం...! Nursing Jobs: భారీ జీతంతో ఎయిమ్స్ లో ఉద్యోగం..! ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల వివరాలు...! SBI Recruitment: నిరుద్యోగులకు అదిరిపోయే వార్త! SBI స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల! Scientist Jobs: నెలకు రూ.2 లక్షల జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు..! ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం! SBI Recruitment: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..! ఎస్‌బీఐలో భారీ ఖాళీలు.. ఇప్పుడే అప్లై చేయండి! Indian Navy: ఇండియన్ నేవీలో భారీ నోటిఫికేషన్...! పరీక్ష లేకుండా ఇండియన్ నేవీ ఆఫీసర్ హోదా...! SSC Latest Update: నిరుద్యోగులకు అలర్ట్! కానిస్టేబుల్ పోస్టుల రాత పరీక్షల షెడ్యూల్ మార్పు...! RBI Jobs: నెలకు 60 వేల జీతంతో రిజర్వ్ బ్యాంక్ జాబ్స్...! ఇప్పుడే అప్లై చేయండి!

TET: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకూ టెట్ తప్పనిసరి..! విద్యాశాఖ కీలక ప్రకటన..!

 ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర విద్యాశాఖ రేపు (శుక్రవారం) లేదా గరిష్టంగా ఎల్లుండి ఈ నోటిఫ

Published : 2025-10-23 13:19:00
UPI Payments: పర్యాటకులకు గుడ్ న్యూస్! జపాన్‌లో మొదటిసారిగా UPI సేవలు!

ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర విద్యాశాఖ రేపు (శుక్రవారం) లేదా గరిష్టంగా ఎల్లుండి ఈ నోటిఫికేషన్‌ను ప్రకటించనుంది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు నేపథ్యంలో, ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకూ ఈసారి టెట్‌ రాసే అవకాశం ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. దీని వలన నిరుద్యోగ అభ్యర్థులతోపాటు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా ఈ పరీక్షలో పాల్గొననున్నారు. 2011కు ముందు టెట్‌ లేకుండా ఎంపికైన టీచర్లు ఇకపై టెట్‌లో అర్హత సాధించాల్సిందేనని సెప్టెంబర్‌ 1న సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ప్రకారం, సర్వీసులో కొనసాగాలంటే ప్రస్తుత ఉపాధ్యాయులు రెండేళ్లలో టెట్‌ పాస్‌ కావాల్సి ఉంటుంది. ఐదేళ్లలో పదవీవిరమణ పొందే వారికి మాత్రం ఈ నిబంధన వర్తించదు.

Prabhass power: ఫౌజీ గా ప్రభాస్ పవర్ లుక్.. హను రాఘవపూడి నుంచి మాస్ ట్రీట్!

విద్యాశాఖ అధికారులు ఈ నేపథ్యంలో సవివరంగా చర్చించి, నవంబరులో జరగబోయే టెట్‌ పరీక్షలో ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయులకు కూడా అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఇది ఉపాధ్యాయుల వృత్తి భద్రతకు మాత్రమే కాకుండా, పాఠశాలల్లో బోధన నాణ్యత పెంపుకు కూడా తోడ్పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టెట్‌ రాయడం ద్వారా ఉపాధ్యాయుల బోధన ప్రమాణాలు మెరుగుపడతాయని, విద్యార్థులకు మరింత సమర్థవంతమైన పాఠశాల వాతావరణం అందుతుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే, పదోన్నతుల కోసం కూడా టెట్‌ పాస్‌ తప్పనిసరి అని స్పష్టం చేశారు.

Upasana Seemantham : మెగా ఇంట్లో డబుల్ సెలబ్రేషన్స్.. ఉపాసన సీమంతం వేడుక వైరల్!

ఇక సుప్రీంకోర్టు తీర్పుపై ఇప్పటికే పలు సంఘాలు రివ్యూ పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ, ప్రభుత్వం ఆ తీర్పు అమలుకు అవసరమైన మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది. ఉత్తర్వులు వెలువడగానే విద్యాశాఖ టెట్‌ నోటిఫికేషన్ షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. ఈసారి టెట్‌లో అర్హత మార్కులు కఠినతరం కానున్నాయి. బీఈడ్‌లో ప్రవేశానికి 40 శాతం మార్కులు ఉన్నా సరే, టెట్‌ రాయాలంటే కనీసం 45 శాతం మార్కులు ఉండాలని స్పష్టంగా నిర్ణయించారు. గతంలో ఈ నిబంధనను సడలించినప్పటికీ, ఈసారి మాత్రం కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Travel: భారతదేశంలో విదేశీ అనుభూతిని ఇస్తున్న గమ్యస్థలాలు!

2011కు ముందు, ఆ తర్వాత విద్యార్హతల్లో మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. టెట్‌ పేపర్‌ 1లో ఎస్జీటీ అభ్యర్థుల కోసం ఓసీలకు 50 శాతం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 45 శాతం మార్కులు అవసరం. పేపర్‌ 2లో కూడా ఇదే నిష్పత్తి అమల్లో ఉంది. ప్రస్తుతం సర్వీసులో కొనసాగుతున్న ఉపాధ్యాయులకు కనీస విద్యార్హత మార్కుల విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. అయితే, టెట్‌ పాస్‌ చేయడం తప్పనిసరి కావడంతో, రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది టీచర్లు పరీక్ష రాయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నోటిఫికేషన్ విడుదలతో ఉపాధ్యాయ వర్గంలో చురుకుదనం పెరిగింది.

Newzealand: న్యూజిలాండ్ కొత్త వీసా! పెట్టుబడి, ఉద్యోగాలు, పెర్మనెంట్ రెసిడెన్స్! వారికి మాత్రమే!
Food Cities: ప్రపంచంలోని టాప్ 10 ఆహార నగరాలు! ముంబై నుండి ఇటలీ వరకు..
Dude: వివాదంలో డ్యూడ్ సినిమా! కోర్టు మెట్లెక్కిన ఇళయరాజా! ఆ పాట కారణంగా..
ఏపీకి వాయుగుండం ముప్పు.. 6 జిల్లాలకు రెడ్ అలర్ట్! రాబోయే 5 రోజులు కుండపోత వర్షాలు..
Bhagavad Gita: జననం మరణం అనివార్యం.. ఇది తెలిసినవాడు శోకించడు... కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -41!
Reddit User: రెండు సార్లు రిజెక్ట్ అయిన ఫ్రాన్స్ వ్యాపార వీసా! కారణాలు ఇవే!

Spotlight

Read More →