NCL Recruitment: 577 ఖాళీలతో ఎన్సీఎల్ నోటిఫికేషన్.. అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇవే! BBC: ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిబిసి కార్యాలయాల్లో లేఆఫ్స్...! 2,000 మందిపై వేటు! Govt Jobs: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. ఏప్రిల్ 22లోగా అప్లై చేసుకోండి! నోటిఫికేషన్ పూర్తి వివరాలు! SSC Notification: నిరుద్యోగులకు శుభవార్త... ఎస్‌ఎస్‌సీ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల! Govt Jobs: ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. పరీక్షా విధానం ఇదే! TCS: ఫ్రెషర్లకు టీసీఎస్ బంపర్ ఆఫర్... 25,000 ఉద్యోగాల నియామకానికి గ్రీన్ సిగ్నల్! AP Investments 2026: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. రూ. 39,436 కోట్ల పెట్టుబడులతో కొలువుల జాతర.!! Govt Jobs 2026: రూ. 32,492 వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాలు! పూర్తి వివరాలు ఇవే... డోంట్ మిస్! High Court Jobs: ఏపీ హైకోర్టులో కొలువుల జాతర.... నేటి నుంచే 300 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం! Gen Z: డిగ్రీ లేకున్నా లక్షల్లో జీతం.. జెన్-జీ కొత్త ట్రెండ్! NCL Recruitment: 577 ఖాళీలతో ఎన్సీఎల్ నోటిఫికేషన్.. అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇవే! BBC: ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిబిసి కార్యాలయాల్లో లేఆఫ్స్...! 2,000 మందిపై వేటు! Govt Jobs: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. ఏప్రిల్ 22లోగా అప్లై చేసుకోండి! నోటిఫికేషన్ పూర్తి వివరాలు! SSC Notification: నిరుద్యోగులకు శుభవార్త... ఎస్‌ఎస్‌సీ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల! Govt Jobs: ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. పరీక్షా విధానం ఇదే! TCS: ఫ్రెషర్లకు టీసీఎస్ బంపర్ ఆఫర్... 25,000 ఉద్యోగాల నియామకానికి గ్రీన్ సిగ్నల్! AP Investments 2026: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. రూ. 39,436 కోట్ల పెట్టుబడులతో కొలువుల జాతర.!! Govt Jobs 2026: రూ. 32,492 వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాలు! పూర్తి వివరాలు ఇవే... డోంట్ మిస్! High Court Jobs: ఏపీ హైకోర్టులో కొలువుల జాతర.... నేటి నుంచే 300 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం! Gen Z: డిగ్రీ లేకున్నా లక్షల్లో జీతం.. జెన్-జీ కొత్త ట్రెండ్!

TET: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకూ టెట్ తప్పనిసరి..! విద్యాశాఖ కీలక ప్రకటన..!

 ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర విద్యాశాఖ రేపు (శుక్రవారం) లేదా గరిష్టంగా ఎల్లుండి ఈ నోటిఫ

Published : 2025-10-23 13:19:00
UPI Payments: పర్యాటకులకు గుడ్ న్యూస్! జపాన్‌లో మొదటిసారిగా UPI సేవలు!

ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర విద్యాశాఖ రేపు (శుక్రవారం) లేదా గరిష్టంగా ఎల్లుండి ఈ నోటిఫికేషన్‌ను ప్రకటించనుంది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు నేపథ్యంలో, ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకూ ఈసారి టెట్‌ రాసే అవకాశం ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. దీని వలన నిరుద్యోగ అభ్యర్థులతోపాటు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా ఈ పరీక్షలో పాల్గొననున్నారు. 2011కు ముందు టెట్‌ లేకుండా ఎంపికైన టీచర్లు ఇకపై టెట్‌లో అర్హత సాధించాల్సిందేనని సెప్టెంబర్‌ 1న సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ప్రకారం, సర్వీసులో కొనసాగాలంటే ప్రస్తుత ఉపాధ్యాయులు రెండేళ్లలో టెట్‌ పాస్‌ కావాల్సి ఉంటుంది. ఐదేళ్లలో పదవీవిరమణ పొందే వారికి మాత్రం ఈ నిబంధన వర్తించదు.

Prabhass power: ఫౌజీ గా ప్రభాస్ పవర్ లుక్.. హను రాఘవపూడి నుంచి మాస్ ట్రీట్!

విద్యాశాఖ అధికారులు ఈ నేపథ్యంలో సవివరంగా చర్చించి, నవంబరులో జరగబోయే టెట్‌ పరీక్షలో ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయులకు కూడా అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఇది ఉపాధ్యాయుల వృత్తి భద్రతకు మాత్రమే కాకుండా, పాఠశాలల్లో బోధన నాణ్యత పెంపుకు కూడా తోడ్పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టెట్‌ రాయడం ద్వారా ఉపాధ్యాయుల బోధన ప్రమాణాలు మెరుగుపడతాయని, విద్యార్థులకు మరింత సమర్థవంతమైన పాఠశాల వాతావరణం అందుతుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే, పదోన్నతుల కోసం కూడా టెట్‌ పాస్‌ తప్పనిసరి అని స్పష్టం చేశారు.

Upasana Seemantham : మెగా ఇంట్లో డబుల్ సెలబ్రేషన్స్.. ఉపాసన సీమంతం వేడుక వైరల్!

ఇక సుప్రీంకోర్టు తీర్పుపై ఇప్పటికే పలు సంఘాలు రివ్యూ పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ, ప్రభుత్వం ఆ తీర్పు అమలుకు అవసరమైన మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది. ఉత్తర్వులు వెలువడగానే విద్యాశాఖ టెట్‌ నోటిఫికేషన్ షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. ఈసారి టెట్‌లో అర్హత మార్కులు కఠినతరం కానున్నాయి. బీఈడ్‌లో ప్రవేశానికి 40 శాతం మార్కులు ఉన్నా సరే, టెట్‌ రాయాలంటే కనీసం 45 శాతం మార్కులు ఉండాలని స్పష్టంగా నిర్ణయించారు. గతంలో ఈ నిబంధనను సడలించినప్పటికీ, ఈసారి మాత్రం కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Travel: భారతదేశంలో విదేశీ అనుభూతిని ఇస్తున్న గమ్యస్థలాలు!

2011కు ముందు, ఆ తర్వాత విద్యార్హతల్లో మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. టెట్‌ పేపర్‌ 1లో ఎస్జీటీ అభ్యర్థుల కోసం ఓసీలకు 50 శాతం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 45 శాతం మార్కులు అవసరం. పేపర్‌ 2లో కూడా ఇదే నిష్పత్తి అమల్లో ఉంది. ప్రస్తుతం సర్వీసులో కొనసాగుతున్న ఉపాధ్యాయులకు కనీస విద్యార్హత మార్కుల విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. అయితే, టెట్‌ పాస్‌ చేయడం తప్పనిసరి కావడంతో, రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది టీచర్లు పరీక్ష రాయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నోటిఫికేషన్ విడుదలతో ఉపాధ్యాయ వర్గంలో చురుకుదనం పెరిగింది.

Newzealand: న్యూజిలాండ్ కొత్త వీసా! పెట్టుబడి, ఉద్యోగాలు, పెర్మనెంట్ రెసిడెన్స్! వారికి మాత్రమే!
Food Cities: ప్రపంచంలోని టాప్ 10 ఆహార నగరాలు! ముంబై నుండి ఇటలీ వరకు..
Dude: వివాదంలో డ్యూడ్ సినిమా! కోర్టు మెట్లెక్కిన ఇళయరాజా! ఆ పాట కారణంగా..
ఏపీకి వాయుగుండం ముప్పు.. 6 జిల్లాలకు రెడ్ అలర్ట్! రాబోయే 5 రోజులు కుండపోత వర్షాలు..
Bhagavad Gita: జననం మరణం అనివార్యం.. ఇది తెలిసినవాడు శోకించడు... కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -41!
Reddit User: రెండు సార్లు రిజెక్ట్ అయిన ఫ్రాన్స్ వ్యాపార వీసా! కారణాలు ఇవే!

Spotlight

Read More →