Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు! Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. మరో కేసు నమోదు! ఈసారి పక్కాగా జైలుకేనా..? Telangana: రేవంత్ రెడ్డి అడిగినా పాడను.. నా గొంతు కేసీఆర్‌కే సొంతం.. గాయని సంచలన ప్రకటన! NHAI New Technology: స్కాన్ చేయండి.. సేఫ్ గా వెళ్ళండి! వాహనదారుల కోసం NHAI సరికొత్త గైడ్! Iran War: ఇరాన్‌కు చైనా సాయం.. అమెరికా పట్టుకున్న నౌకతో గుట్టురట్టు? హర్మూజ్ జలసంధిలో హైడ్రామా.. Qatar: ఖతార్‌లో మిన్నంటిన బాబు జన్మదిన వేడుకలు.. భారీగా తరలివచ్చిన ఎన్‌ఆర్‌ఐలు! Chandrababu Campaign: తమిళనాడులో రెండో రోజు చంద్రబాబు ప్రచారం.. నేడు విరుధునగర్ జిల్లాలో పర్యటన! AP Government: గ్రామీణ పేదలకు వరంగా మారిన ఉపాధి హామీ.. భారీగా నిధులు విడుదల! Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు! Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. మరో కేసు నమోదు! ఈసారి పక్కాగా జైలుకేనా..? Telangana: రేవంత్ రెడ్డి అడిగినా పాడను.. నా గొంతు కేసీఆర్‌కే సొంతం.. గాయని సంచలన ప్రకటన! NHAI New Technology: స్కాన్ చేయండి.. సేఫ్ గా వెళ్ళండి! వాహనదారుల కోసం NHAI సరికొత్త గైడ్! Iran War: ఇరాన్‌కు చైనా సాయం.. అమెరికా పట్టుకున్న నౌకతో గుట్టురట్టు? హర్మూజ్ జలసంధిలో హైడ్రామా.. Qatar: ఖతార్‌లో మిన్నంటిన బాబు జన్మదిన వేడుకలు.. భారీగా తరలివచ్చిన ఎన్‌ఆర్‌ఐలు! Chandrababu Campaign: తమిళనాడులో రెండో రోజు చంద్రబాబు ప్రచారం.. నేడు విరుధునగర్ జిల్లాలో పర్యటన! AP Government: గ్రామీణ పేదలకు వరంగా మారిన ఉపాధి హామీ.. భారీగా నిధులు విడుదల!

Poland: పోలాండ్‌లో విశాఖ వాసి మృతి.. స్వగ్రామానికి రానున్న మృతదేహం!

Poland: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు అనారోగ్యంతో మృతి చెందిన ఘటన విశాఖ జిల్లాలో విషాదాన్ని నింపింది. భీమునిపట్నం మండలం మహాలక్ష్మిపురం గ్రామానికి చెందిన గోకేటి ప్రసాద్ బాబు (40) ఎనిమిది నెలల క్రితం ఉద్యోగం కోసం పోలాండ్‌కు వెళ్లగా, ఈ నెల 4వ తేదీన అక్కడే కన్నుమూశారు.

Published : 2026-04-19 09:54:00

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన యువకుడు అనారోగ్యంతో మృతి..

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో..

విశాఖపట్నం: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు అనారోగ్యంతో మృతి చెందిన ఘటన విశాఖ జిల్లాలో విషాదాన్ని నింపింది. భీమునిపట్నం మండలం మహాలక్ష్మిపురం గ్రామానికి చెందిన గోకేటి ప్రసాద్ బాబు (40) ఎనిమిది నెలల క్రితం ఉద్యోగం కోసం పోలాండ్‌కు వెళ్లగా, ఈ నెల 4వ తేదీన అక్కడే కన్నుమూశారు.

వెల్డర్‌గా పనిచేస్తున్న ప్రసాద్ బాబు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇంట్లో విషాద వాతావరణం నెలకొంది.

మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడంలో కొంత ఆలస్యం జరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో పోలాండ్‌లోని పోలాండ్ తెలుగు అసోసియేషన్ (PoTA) సభ్యులు ముందుకొచ్చారు. సంఘం అధ్యక్షుడు చంద్రబాను అక్కల, కార్యదర్శి శైలేంద్ర గంగుల, అలాగే ప్రసాద్ బాబు స్నేహితులు కలిసి ఒక బృందంగా ఏర్పడి చర్యలు ప్రారంభించారు.

వారు పోలాండ్‌లోని భారత రాయబారి కార్యాలయం, స్థానిక ఆసుపత్రి అధికారులు, విమాన సంస్థలతో సమన్వయం చేస్తూ మృతదేహాన్ని త్వరితగతిన భారత్‌కు తరలించే ఏర్పాట్లు చేశారు. వారి కృషి ఫలించి, ప్రసాద్ బాబు మృతదేహం ఈ నెల 20వ తేదీ సోమవారం స్వగ్రామానికి చేరుకోనుందని కుటుంబ సభ్యులు తెలిపారు.

అదే రోజు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విదేశాల్లో ఉన్న తెలుగు సంఘాలు చూపిన సహకారం తమకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని కుటుంబ సభ్యులు భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొనగా, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే కార్మికుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.

Spotlight

Read More →