నూతన ఆవిష్కరణలకు వేదికనిచ్చే మరో అడుగు! ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈసారి ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ 2025 (ESTIC 2025)లో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు. ప్రధానాంశం ఏమిటంటే… ప్రైవేట్ రంగంలో పరిశోధన, అభివృద్ధికి ప్రోత్సాహం ఇవ్వడానికి రూ. 1 లక్ష కోట్ల RDI ఫండ్ ప్రారంభించడం.
ఈ ఫండ్ ద్వారా ప్రైవేట్ రంగ కంపెనీలు, స్టార్టప్స్ పరిశోధనలో పెట్టుబడి పెట్టడం సులభం అవుతుంది. కేంద్రం చెప్పిన విధంగా ఇది భవిష్యత్ టెక్నాలజీలలో భారత్కి ఆధునిక స్థానాన్ని అందించే ప్రయత్నం.
భారత్ ఘనతలకు అద్దం – కాఫీ టేబుల్ బుక్
ఈ సందర్భంలో ప్రధాని మోడీ భారత్ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించిన ఘనతలను ప్రదర్శించే కాఫీ టేబుల్ బుక్ ను ప్రారంభించారు. అంతేకాక, శాస్త్ర, సాంకేతిక రంగాల భవిష్యత్ దిశలను వివరించే ఒక విజన్ డాక్యుమెంట్ ను కూడా విడుదల చేశారు. దేశంలోని యువత, పరిశోధకులు దీనిని ప్రేరణగా తీసుకోవచ్చని కేంద్రం భావిస్తోంది.
RDI ఫండ్ నిర్మాణం – రెండు స్థాయిలలో పెట్టుబడి
మొదటి స్థాయి: అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా కేంద్ర ఫండ్ రూపంలో రూ. 1 లక్ష కోట్లను నిర్వహణ.
రెండవ స్థాయి: ఫండ్ నేరుగా కంపెనీలకు ఇవ్వబడదు. సెకండ్-లెవల్ ఫండ్ మేనేజర్లు పెట్టుబడులను పరిశీలించి, స్వతంత్ర కమిటీల సిఫార్సులతో పంపిణీ చేస్తారు.
ప్రైవేట్ రంగానికి ఇది పెద్ద అవకాశం. పెట్టుబడులు, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలో దూకుడు… భారత్ పరిశోధన రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుంది.
సాంకేతిక రంగంలో భారత భవిష్యత్తు రీసెర్చ్, ఇన్నోవేషన్, స్టార్టప్ వాతావరణం పెరగడం, నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. నూతన టెక్నాలజీలు, గ్లోబల్ మార్కెట్లలో భారత పరిశోధకులకి గుర్తింపు… ఈ ఫండ్ ద్వారా ఇది సాధ్యం అవుతుంది.
ప్రధాని మోడీ చెప్పినట్టే భారతదేశం సైన్స్, టెక్నాలజీ రంగంలో ప్రపంచానికి నమూనాగా నిలవాలి అనే అద్భుతమైన లక్ష్యం ఈ ఫండ్ ద్వారా నెరవేరే దిశలో అడుగుపెడుతోంది.