శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ!

ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో యూరియా కొరత తీవ్రంగా కనిపించింది. రైతులు ఎరువుల బస్తాల కోసం ఎక్కడికక్కడ తిప్పలు పడ్డారు. ముఖ్యంగా ఖరీఫ్‌ సీజన్‌లో పంటల సాగు సమయంలో యూరియా డిమాండ్‌ పెరగడంతో కొరత ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఏపీ ప్రభుత్వం యూరియా బస్తాలను సమకూర్చినా, కొందరు రైతులు మోతాదుకు మించి యూరియా వాడటం వల్ల పరిస్థితి మరింత క్లిష్టమైంది. అధిక యూరియా వాడితే పంట దిగుబడి పెరుగుతుందనేది చాలామంది రైతుల్లో నెలకొన్న అపోహ అని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో స్పష్టం చేశారు. పంటల పెరుగుదలలో మైక్రో న్యూట్రియెంట్స్‌ కీలకమని, యూరియా పరిమిత వాడకం వ్యవసాయానికి మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. యూరియా వాడకాన్ని తగ్గించే రైతులకు ప్రతి బస్తా తగ్గించినందుకు రూ.800 ప్రోత్సాహకంగా అందిస్తామని సీఎం ప్రకటించారు.

Google vizag: విశాఖలో గూగుల్ AI హబ్‌పై సీఎం సంతోషం.. యంగెస్ట్ స్టేట్, హై ఇన్వెస్ట్మెంట్ హాష్‌ట్యాగ్.. వైజాగ్ లోని G అంటే!

రబీ సీజన్‌ ప్రారంభానికి ముందు యూరియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం సరికొత్త యంత్రాంగాన్ని సిద్ధం చేసింది. ఈసారి యూరియా పంపిణీ పూర్తిగా డిజిటల్ విధానంలో, పద్ధతి ప్రకారం జరుగనుంది. రైతుల ఆధార్‌ అనుసంధానిత మొబైల్‌ నంబర్‌కు వచ్చే OTP ద్వారా ధృవీకరణ జరిపి, వారి పంటకు అవసరమైన యూరియా పరిమాణాన్ని నిర్ణయిస్తారు. పంట అవసరాన్ని బట్టి యూరియా మూడు విడతల్లో రైతులకు అందిస్తారు. ఈ విధానం ద్వారా రైతులు మోతాదుకు మించి యూరియా తీసుకెళ్లకుండా నియంత్రణ ఉంటుంది. ఖరీఫ్‌లో ఇలాంటి విధానం లేకపోవడం వల్ల కొందరు రైతులు అధికంగా యూరియా తీసుకుని నిల్వ చేసుకోవడం, దుర్వినియోగం చేయడం జరిగినందున ప్రభుత్వం ఈసారి జాగ్రత్తలు తీసుకుంటోంది.

బిగ్ షాక్! అమెరికా సుంకాల దెబ్బ.. 37.5 శాతం కుప్పకూలిన భారత ఎగుమతులు! 4 నెలల్లోనే..!

ఈ రబీ సీజన్‌ నుంచి యూరియా పంపిణీకి ఈ-పంట వివరాలు ప్రామాణికంగా తీసుకోబోతున్నారు. రైతు ఏ పంట సాగు చేస్తున్నాడో, ఎన్ని ఎకరాలు ఉన్నాయో, ఎంత యూరియా అవసరమో వ్యవసాయశాఖ అధికారులు ఈ-పంట రికార్డుల ఆధారంగా నిర్ధారిస్తారు. దీని వల్ల సరైన రైతుకే సరైన పరిమాణంలో యూరియా చేరుతుంది. దుర్వినియోగం, అక్రమ విక్రయాలు పూర్తిగా అరికట్టే అవకాశం ఉంటుంది. రైతు ఏ పంట కోసం ఎంత యూరియా తీసుకున్నాడో కూడా రికార్డుగా ఉండడం వల్ల పారదర్శకత పెరుగుతుంది. పంటకు అవసరమైన ఎరువులు సమయానికి అందడం, దిగుబడి నాణ్యత మెరుగుపడడం ప్రధాన లక్ష్యం.

Pak-Afghan: పాక్ అఫ్గాన్ ఘర్షణలు ఉధృతం.. సరిహద్దులో తుపాకీ కాల్పులు, భారీ ఉద్రిక్తత.. పాకిస్థాన్ యుద్ధ ట్యాంకులను!

రబీ సీజన్‌కి ముందే రైతులు ఈ-పంట నమోదు తప్పనిసరిగా చేసుకోవాలి. ప్రభుత్వం ఖరీఫ్‌ సీజన్‌ కోసం ఈ-పంట నమోదు గడువును ఈ నెల 25 వరకు పొడిగించింది. ఈ నెల 30 వరకు సవరణలు, సామాజిక తనిఖీ జరగనుంది. తుది జాబితా అక్టోబర్‌ 31న రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించబడుతుంది. అధికారులు రైతులను సమయానికి నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ-పంట రిజిస్ట్రేషన్‌ లేకపోతే యూరియా పంపిణీతో పాటు ప్రభుత్వ పథకాలు, బీమా డబ్బులు కూడా అందకపోవచ్చు. రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రాబోయే రబీ సీజన్‌లో ఎరువుల కొరత లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని వ్యవసాయశాఖ సూచించింది.

Diwali Deals: దీపావళి బొనాంజా..! షాపింగ్‌లో ఎక్కువ సావింగ్‌ కావాలా? ఈ పేమెంట్‌ మోడ్‌ ఉపయోగించండి!
DSC: జనవరిలో 2వేల DSC పోస్టులకు నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు.. మంత్రి లోకేశ్ హామీ మేరకు!
RBI మెడికల్ కన్సల్టెంట్ పోస్టులు! జీతం, అర్హత, షరతులు ఇవే!
భారత్-చైనా వివాదం.. WTO వద్ద భారత్ పై ఫిర్యాదు !!
Prime Minister: శ్రీశైల మల్లన్నను దర్శించుకోనున్న నాలుగో ప్రధాని.. గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ స్వాగతం!
Adhaar: ఆధార్‌లో పొరపాట్లు? ఆందోళన అవసరం లేదు..! సమస్యలకు పరిష్కారం.. ఇక ఇంటి నుంచే!