దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్.. కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘పంచ్ ఈవీ’ బుకింగ్స్ను ప్రారంభించింది. ఆన్లైన్లో రూ.21,000 డౌన్ పేమెంట్తో ఈ మోడల్ను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. దీనికి తోడు ‘యాక్టి.ఈవీ’ పేరుతో మరో ఈవీ మోడల్ను అభివృద్ధి చేస్తోంది.
భారత్ మార్కెట్లో టాటా పంచ్ మైక్రో SUV ప్రారంభ ధర రూ.6 లక్షలుగా (ఎక్స్షోరూం) ఉంది. అదే టాప్ ఎండ్ వేరియంట్ రూ.10.10 లక్షలుగా (ఎక్స్షోరూం) ఉంది. ప్యూర్, అడ్వెండర్, అకాంప్లిష్డ్, క్రియేటివ్ వేరియంట్లలో లభిస్తుంది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
టాటా పంచ్ వాహనం స్టాండర్డ్ భద్రతా ఫీచర్లతో వస్తుంది. ABS- యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, EBD, రియర్ పార్కింగ్ సెన్సార్లు, సెంట్రల్ లాకింగ్ వంటి కీలక ఫీచర్లను కలిగి ఉంటాయి. అదే హై ఎండ్ మోడళ్లు హోం హెడ్ల్యాంప్, యాంటీ గ్లేర్ రియర్వ్యూ మిర్రర్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ట్రాక్షన్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎలక్ర్టిక్ కారు బ్యాటరీ ఒకసారి చార్జింగ్ చేస్తే 300 నుంచి 600 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ప్లాట్ఫామ్ ఆధారంగా వచ్చే ఏడాదిన్నరలో ఐదుకు పైగా ఈవీ మోడల్స్ మార్కెట్లోకి విడుదల చేస్తామని కంపెనీ ప్రకటించింది.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి