Kuwait Updates: టూరిస్ట్, ఫ్యామిలీ వీసాలు ఇకపై ఆన్‌లైన్‌లోనే! కువైట్ కొత్త సదుపాయం! ఒకే చోట అన్ని సేవలు...

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే అభివృద్ధి పనులకు కొత్త ఊపు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టులలో భాగంగా రాష్ట్రానికి 26 కొత్త రైల్వే ప్రాజెక్టులు మంజూరయ్యాయి. వీటిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు మూడు ముఖ్యమైన ప్రాజెక్టులు లభించాయి. హైదరాబాద్‌–చెన్నై హైస్పీడ్ కారిడార్‌ ప్రణాళిక కూడా ముందుకు సాగుతోంది. ఈ ప్రాజెక్టులు అమలులోకి వస్తే, రాష్ట్రంలోని రైల్వే కనెక్టివిటీ, సరకు రవాణా, ప్రయాణికుల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. ఇప్పటికే చెన్నై నుంచి రేణిగుంట వరకు లెవల్‌ క్రాసింగ్‌ల వద్ద నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి.

Steel Bridge: ట్రాఫిక్ సమస్యలకు చెక్..! రూ.70 కోట్లతో స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణం.. ఆ ప్రాంతం లోనే..!

ప్రస్తుతం ఉన్న ట్రాక్‌లపై సరకు రైళ్లు, హైస్పీడ్ రైళ్లు రెండూ ఒకేసారి నడవడం కష్టంగా మారింది. దీని వలన రైళ్ల రాకపోకల్లో ఆలస్యం ఏర్పడుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కొత్త ట్రాక్‌లు వేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందుకోసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు (డీపీఆర్‌) సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. ఈ నివేదికలను డిసెంబర్‌ చివరినాటికి పూర్తి చేయాలని గడువు నిర్ణయించారు. ఈ కొత్త లైన్లు పూర్తి అయితే, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో రైల్వే రవాణా వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతుంది.

Pm Modi: ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం.. పరిహారం ప్రకటింపు... టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణం!

చెన్నై–తిరుపతి మార్గంలో అరక్కోణం–రేణిగుంట మధ్య 43 కిలోమీటర్ల పొడవున కొత్త ట్రాక్‌లు ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ మార్గం సింగిల్ లైన్‌గా ఉండటంతో, రైళ్ల రద్దీ పెరిగిపోతోంది. తిరుమల దర్శనానికి వేలాదిమంది భక్తులు తిరుపతికి రావడంతో ఈ రూట్‌లో ట్రాఫిక్ అధికంగా ఉంటుంది. సరకు రైళ్లు, ప్రయాణికుల రైళ్లు ఒకే ట్రాక్‌లో నడవడం వల్ల సమస్యలు వస్తున్నాయి. అందుకే మూడు లేదా నాలుగు కొత్త లైన్లు వేసే ప్రతిపాదనను రైల్వే శాఖ ముందుకు తెచ్చింది. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే తిరుపతి–చెన్నై ప్రయాణం వేగంగా సాగుతుంది.

RDI Fund: ప్రైవేట్ పెట్టుబడులకి కొత్త అవకాశం… మోడీ ప్రారంభించిన RDI ఫండ్ !!

అలాగే చెన్నై–గూడూరు మార్గంలో కూడా గుమ్మడిపూండి–సూళ్లూరుపేట మధ్య 18.4 కిలోమీటర్లు, సూళ్లూరుపేట–గూడూరు మధ్య 55 కిలోమీటర్ల దూరం వరకు కొత్త ట్రాక్‌లు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రతిపాదనలు రైల్వే అధికారుల ఆమోదం పొందిన వెంటనే పనులు ప్రారంభమవుతాయి. ఈ లైన్లు పూర్తయితే చెన్నై వైపు రైళ్ల సంఖ్యను పెంచే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ కొత్త రైల్వే లైన్లు పూర్తయితే, రవాణా వేగం పెరగడంతోపాటు, ప్రయాణికుల సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడనున్నాయి.

₹2000 నోటు చెల్లుబాటు అవుతుందా? RBI క్లారిటీ.. ఇకపై ఎక్కడ మార్చుకోవాలంటే?
CA Results: సీఏ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల..! వెంటనే చెక్‌ చేసుకోండి..!
ఇండియన్ రైల్వే నుంచి కీలక ప్రకటన! ఆ నాలుగు మార్గాలకు కొత్త వందే భారత్ సర్వీసులు!
నవంబర్‌లో బిగ్గెస్ట్ అప్‌డేట్.. మహేష్-రాజమౌళి సినిమా! భారత సినీ చరిత్రలోనే తొలిసారి..!
TET: సుప్రీంకోర్ట్ తీర్పుతో టీచర్ల ‘టెట్‌’ పరీక్ష భయం..! రివ్యూ పిటిషన్‌పై ఆశలు..!
Labubu: ది మాన్స్టర్స్ సిరీస్‌లో భాగమైన లబుబు.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షనర్స్‌ క్రేజ్‌!