కాశీబుగ్గ ఆలయంలో విషాదం! మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ప్రభుత్వ ఆర్థిక సాయం!

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ కావడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ ఉదయం ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి సిట్‌ (SIT) అధికారులు వెళ్లి విచారణ చేపట్టారు. అనంతరం జోగి రమేష్‌తో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు ఆరేపల్లి రామును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్య రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తోంది.

Highway Expansion: ఆ హైవే విస్తరణకు గ్రీన్ సిగ్నల్! రూ.1,000 కోట్లతో నాలుగు లైన్లుగా... ఈ రూట్లోనే!

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు, ఇటీవల పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో జోగి రమేష్ పేరు ప్రస్తావించినట్లు సమాచారం. ఆయన ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారీ, పంపిణీ జరిగిందని జనార్దనరావు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ వాంగ్మూలం ఆధారంగా సిట్‌ అధికారులు లోతుగా దర్యాప్తు జరిపి, సాక్ష్యాలను సేకరించిన తర్వాత అరెస్టు చర్య చేపట్టారు.

IPS: ఏపీ పోలీస్ శాఖలో భారీ బదిలీలు..! 21 మంది ఐపీఎస్ అధికారులకు కొత్త పోస్టింగులు..!

ప్రస్తుతం జోగి రమేష్‌ను పోలీసులు విచారణ కోసం తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటన రాజకీయంగా కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రతిఆరోపణలు కొనసాగుతుండగా, ఈ అరెస్ట్‌తో నకిలీ మద్యం కేసు మరింత వేడి పుట్టించింది. సిట్‌ అధికారులు మరికొంతమంది నిందితులను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Promotions: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారందరికీ పదోన్నతులు!
Andhra Pradesh: ఉద్యోగులకు శుభవార్త.. ఏపీలో 1500 మందికి పైగా పదోన్నతులు!
Morning Habits: ఉదయం నిద్రలేవగానే తప్పనిసరిగా చేయాల్సిన పనులు! చాలా మందికి తెలియదు!
New Flyover: ట్రాఫిక్ సమస్యలకు చెక్... కొత్త ఫ్లైఓవర్! ఆ ప్రాంతంలోనే.. విజయవాడకు దూసుకెళ్లిపోవచ్చు!