Prabhas Marriage: ప్రభాస్ కి పెళ్లి ఫిక్స్..! అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలిస్తే ఫ్యూజులు అవుట్…!

సినీ నటుడు రాజీవ్ కనకాల భూ వివాదంలో చిక్కుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి రాచకొండ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. మరోవైపు, అదే కేసులో నిర్మాత విజయ్ చౌదరిపై హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 421లోని ఓ ఫ్లాట్‌ను రాజీవ్ కనకాల ఇటీవల విజయ్ చౌదరికి విక్రయించారు. అన్నీ అధికారికంగా రిజిస్ట్రేషన్ పూర్తైనట్లు సమాచారం. కానీ విజయ్ చౌదరి అదే ఫ్లాట్‌ను మరో వ్యక్తి శ్రవణ్ రెడ్డికి రూ.70 లక్షలకు తిరిగి అమ్మేశారు.

Divya Deshmukh: చ‌రిత్ర సృష్టించిన దివ్య దేశ్‌ముఖ్‌..! తొలి భార‌తీయ మ‌హిళ‌గా అరుదైన ఘ‌న‌త‌!


అయితే ఇటీవల శ్రవణ్ రెడ్డి ఆ ఫ్లాట్‌ను పరిశీలించేందుకు వెళ్లగా, అక్కడ ఎలాంటి ప్లాట్ లేకపోవడం గమనించి, నకిలీ స్థలంతో మోసగించారనే అనుమానంతో విజయ్‌ను ప్రశ్నించారు. స్పందనలో విజయ్ వివాదముందని తప్పించుకోవడం, చివరికి బెదిరింపులకు దిగాడని శ్రవణ్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో స్థలాన్ని తొలి విక్రేతగా విక్రయించిన రాజీవ్ కనకాల పాత్రపై స్పష్టత అవసరమై, ఆయనకు నోటీసులు పంపించారు. మొత్తం లావాదేవీలో ఆయన ప్రమేయంపై విచారణ కొనసాగుతోంది.

Change Village Names:ఏపీ ప్రజలకు బంపరాఫర్.. మీ ఊరి పేరు నచ్చలేదా, అయితే మార్చుకోవచ్చు..! ఎలా అంటే!
Narendra Modi: ప్రధాని మోదీ యూకే పర్యటన షురూ..! వాణిజ్య ఒప్పందం, ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి!
AP Development: ఏపీకి మరో 4 ప్రతిష్టాత్మక కంపెనీలు.. ఆ జిల్లాకు పండగే! ఏకంగా రూ.20 వేలకోట్లు పెట్టుబడులు!
Narayana: కార్యకర్తలకు గుడ్ న్యూస్! కీలక ప్రకటన చేసిన మంత్రి నారాయణ!
Praja Vedika: నేడు (24/7) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Red Alert: హైదరాబాద్ వాసులకు రెడ్ అలర్ట్! రెండు రోజులు భారీ వర్షాలు!